Kottu Satyanarayana: దుర్గమ్మ గుడిపై రాజకీయాలా.. చంద్రబాబుపై మంత్రి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. దసరా ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయి.. జిల్లా కలెక్టరు, పోలీసు కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన చంద్రబాబు రాజకీయాలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఏపీ ప్రజల అభివృద్ధి కోసం సీఎం జగన్ పని చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం ఏపికి జరగకూడదని సీఎం అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు 10ఏళ్ల ఉమ్మడి రాజధాని ఎందుకు వదిలి వచ్చామో చెప్తే బాగుండేదన్నారు.
రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు స్వార్థం వదిలి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడాలి. 2014లో నేను మారిపోయా అని చెప్పాడు. అధికారంలోకి రాగానే చంద్రబాబు మాట మార్చాడు. చంద్రబాబు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేదు. 150కోట్లు దుర్గ గుడికి ఇచ్చానని అబద్ధాలు చెప్తున్నారు. క్యూ కాంప్లెక్స్ ఒకటి కట్టి 150కోట్లతో అభివృద్ధి చేశా అని చెప్పడం ఏంటి? సీఎం జగన్ ఎక్కడ మాట తప్పారో చంద్రబాబు చెప్పాలి. అమరావతి రాజధాని కాదని సీఎం జగన్ ఎక్కడ చెప్పారు. రాజధాని అమరావతి కాబట్టి ఇల్లు ఇక్కడ కట్టుకున్నారు. అమరావతి వద్దు హైదరాబాద్ ముద్దు అంటున్నది చంద్రబాబే అన్నారాయన.
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
మీరు కోరుకున్నట్లు రియల్ ఎస్టేట్ రాజధాని ఏర్పాటు చేయమంటే సాధ్యం కాదు. మీరు డిక్లేర్ చేసిన రాజధాని ఏర్పాటు చేయాలంటే ఎలా? మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.ఉత్తరాంధ్ర,రాయలసీమ ఓట్లు మీకు అవసరం లేదా? రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే…కోర్టులో కేసులు వేసింది నిజం కాదా? చంద్రబాబుకు ఆ జగన్మాత మంచి బుద్ధిని ప్రసాదించాలి. మూడు రాజధానుల ఏర్పాటు అయ్యేలా చంద్రబాబుకు ఆలోచనా జ్ఞానం పెరగాలని దుర్గమ్మను వేడుకుంటున్నా అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!