Kottu Satyanarayana: దుర్గమ్మ గుడిపై రాజకీయాలా.. చంద్రబాబుపై మంత్రి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. దసరా ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయి.. జిల్లా కలెక్టరు, పోలీసు కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన చంద్రబాబు రాజకీయాలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఏపీ ప్రజల అభివృద్ధి కోసం సీఎం జగన్ పని చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం ఏపికి జరగకూడదని సీఎం అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు 10ఏళ్ల ఉమ్మడి రాజధాని ఎందుకు వదిలి వచ్చామో చెప్తే బాగుండేదన్నారు.
రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు స్వార్థం వదిలి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడాలి. 2014లో నేను మారిపోయా అని చెప్పాడు. అధికారంలోకి రాగానే చంద్రబాబు మాట మార్చాడు. చంద్రబాబు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేదు. 150కోట్లు దుర్గ గుడికి ఇచ్చానని అబద్ధాలు చెప్తున్నారు. క్యూ కాంప్లెక్స్ ఒకటి కట్టి 150కోట్లతో అభివృద్ధి చేశా అని చెప్పడం ఏంటి? సీఎం జగన్ ఎక్కడ మాట తప్పారో చంద్రబాబు చెప్పాలి. అమరావతి రాజధాని కాదని సీఎం జగన్ ఎక్కడ చెప్పారు. రాజధాని అమరావతి కాబట్టి ఇల్లు ఇక్కడ కట్టుకున్నారు. అమరావతి వద్దు హైదరాబాద్ ముద్దు అంటున్నది చంద్రబాబే అన్నారాయన.
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
మీరు కోరుకున్నట్లు రియల్ ఎస్టేట్ రాజధాని ఏర్పాటు చేయమంటే సాధ్యం కాదు. మీరు డిక్లేర్ చేసిన రాజధాని ఏర్పాటు చేయాలంటే ఎలా? మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.ఉత్తరాంధ్ర,రాయలసీమ ఓట్లు మీకు అవసరం లేదా? రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే…కోర్టులో కేసులు వేసింది నిజం కాదా? చంద్రబాబుకు ఆ జగన్మాత మంచి బుద్ధిని ప్రసాదించాలి. మూడు రాజధానుల ఏర్పాటు అయ్యేలా చంద్రబాబుకు ఆలోచనా జ్ఞానం పెరగాలని దుర్గమ్మను వేడుకుంటున్నా అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?