Minister Kanna Babu: వాళ్లు స్టే తెచ్చుకుంటారు తప్ప.. తప్పు చేయలేదని చెప్పగలరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాజకీయాల్లో పెగాసస్ వివాదం హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి తెరలేపాయి. ఈ నేపథ్యంలో టీడీపీని ఉద్దేశిస్తూ మంత్రి కురసాల కన్నబాబు విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిఘా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. అధికారులు, పొలిటికల్ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. చివరికి సినిమా యాక్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని విమర్శించారు. గతంలో ఇంటిలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై అనేక ఆరోపణలు వచ్చాయన్నారు.
మమతాబెనర్జీ.. చంద్రబాబుపై ఆరోపణలు చేయటంతో పెగాసస్ విషయం మళ్ళీ వెలుగులోకి వచ్చిందని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని హౌస్ కమిటీ వేయడం మంచి పరిణామం అన్నారు. ఈ కమిటీలో అన్ని పార్టీల సభ్యులు ఉంటారు కాబట్టి సరిగ్గా విచారణ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏ కేసులపై అయినా స్టే తెచ్చుకుంటామనే నమ్మకం చంద్రబాబు, లోకేష్కు ఉందని.. స్టేలు వస్తాయనే తప్ప తాము తప్పు చేయలేదని వారు ఎప్పుడూ చెప్పరని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. కానీ ఈ కేసులో స్టే తెచ్చుకోలేరని.. వారు దొరికిపోతారని ఆరోపించారు. హౌస్ కమిటీ విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. ఆ రోజు ఐటీ మంత్రిగా లోకేషే ఉన్నాడని.. పెగాసెస్ అనేది దేశ భద్రతకు సంబంధించిన అంశమన్నారు. అందుకే ఈ అంశంపై సీరియస్గా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
మరోవైపు పెగాసస్ వివాదంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. పెగాసస్ అంశంలో అవసరమైతే మమతా బెనర్జీని కూడా ఆధారాలు ఉంటే ఇవ్వమని అడుగుతామని బాలినేని తెలిపారు. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును కూడా అవసరమైతే విచారిస్తామన్నారు. పెగాసెస్ సాఫ్ట్వేర్పై లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు మమతా బెనర్జీని కలిశారని.. హౌస్ కమిటీ విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని మంత్రి బాలినేని అన్నారు. ఇంత దుర్మార్గమైన వ్యవహారాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?