Minister Kanna Babu: వాళ్లు స్టే తెచ్చుకుంటారు తప్ప.. తప్పు చేయలేదని చెప్పగలరా?
ఏపీ రాజకీయాల్లో పెగాసస్ వివాదం హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి తెరలేపాయి. ఈ నేపథ్యంలో టీడీపీని ఉద్దేశిస్తూ మంత్రి కురసాల కన్నబాబు విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిఘా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. అధికారులు, పొలిటికల్ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. చివరికి సినిమా యాక్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని విమర్శించారు. గతంలో ఇంటిలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై అనేక ఆరోపణలు వచ్చాయన్నారు.
మమతాబెనర్జీ.. చంద్రబాబుపై ఆరోపణలు చేయటంతో పెగాసస్ విషయం మళ్ళీ వెలుగులోకి వచ్చిందని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని హౌస్ కమిటీ వేయడం మంచి పరిణామం అన్నారు. ఈ కమిటీలో అన్ని పార్టీల సభ్యులు ఉంటారు కాబట్టి సరిగ్గా విచారణ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏ కేసులపై అయినా స్టే తెచ్చుకుంటామనే నమ్మకం చంద్రబాబు, లోకేష్కు ఉందని.. స్టేలు వస్తాయనే తప్ప తాము తప్పు చేయలేదని వారు ఎప్పుడూ చెప్పరని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. కానీ ఈ కేసులో స్టే తెచ్చుకోలేరని.. వారు దొరికిపోతారని ఆరోపించారు. హౌస్ కమిటీ విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. ఆ రోజు ఐటీ మంత్రిగా లోకేషే ఉన్నాడని.. పెగాసెస్ అనేది దేశ భద్రతకు సంబంధించిన అంశమన్నారు. అందుకే ఈ అంశంపై సీరియస్గా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
మరోవైపు పెగాసస్ వివాదంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. పెగాసస్ అంశంలో అవసరమైతే మమతా బెనర్జీని కూడా ఆధారాలు ఉంటే ఇవ్వమని అడుగుతామని బాలినేని తెలిపారు. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును కూడా అవసరమైతే విచారిస్తామన్నారు. పెగాసెస్ సాఫ్ట్వేర్పై లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు మమతా బెనర్జీని కలిశారని.. హౌస్ కమిటీ విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని మంత్రి బాలినేని అన్నారు. ఇంత దుర్మార్గమైన వ్యవహారాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో