Kakani Govardhan Reddy: టీడీపీ డ్రామాలు ఆడుతోంది.. విలువైన సమయం వృధా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ సభ్యులు ప్రజల సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. విలువైన సభా సమయాన్ని వృధా చేస్తూ సభను అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఘనకార్యం ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సమస్యలపై చర్చించే దమ్ము ధైర్యం లేదన్నారు. ఆ సమస్యపై ప్రశ్న వేసిన టీడీపీ సభ్యులు కూడా దాని గురించి మాట్లాడటం లేదు. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడకుండా బయట మీడియా ముందు డ్రామాలు వేస్తున్నారు. సభలో చర్చిస్తే వాస్తవాలు ప్రజలకి తెలుస్తాయన్నారు.
అలా చర్చ జరిగితే చంద్రబాబు బండారం బయటపడుతుందని వారి భయం. మూడు రాజధానుల విషయంలో సీఎం ఇచ్చిన వివరణ చూసిన తర్వాత ప్రజల్లో చర్చ ప్రారంభం అయింది. రైతు ఆత్మహత్యలకు సంబంధించి పరిహారం ఎగ్గొడితే మేము చెల్లించాం. ఎమ్మెల్యే కానీ వ్యక్తి మాట్లాడే వాటి గురించి నేను మాట్లాడటం అవమానంగా వుంటుందన్నారు. అవగాహన, అనుభవం లేని వ్యక్తి మాటలు పట్టించుకోనవసరం లేదు. పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే…రాజకీయ అనుభవం లేదు. ఒకటికి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన రాజకీయ అనుభవం పవన్ ది. ప్రజలు తమకు సమాధి కట్టడానికి సిద్దంగా ఉన్నారు అనేది చంద్రబాబుకి తెలుసు. ఆ ఫ్రస్టేషన్ లో ఆయన ఏదేదో డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కాకాని.
Also Read
- CM Chandrababu: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్.. రంగంలోకి సీఎం చంద్రబాబు..!
- Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
- Sai Krishna Case Updates: సాయికృష్ణ కస్టోడియల్ డె*త్ కేసు.. సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి
- Seven Fishermen Missing: విశాఖ తీరంలో ఉత్కంఠ.. సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ గాలింపు
Read Also: Ap Assembly 3rd Day Session Live Updates : మూడవరోజు అసెంబ్లీ సమావేశాలు
మరోవైపు చీఫ్ విప్ ప్రసాద్ రాజు టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. బి.ఏ.సి లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సభ జరుగుతుంది. ఎప్పుడు సస్పెండ్ చేసుకుని వెళ్ళిపొదామా అన్నట్టు టీడీపీ సభ్యులు ప్రవర్తన ఉంది. సభను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తుందన్నారు. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు ప్రభుత్యం సిద్దంగా ఉందన్నారు. చర్చకు టీడీపీ నాయకులు భయపడుతున్నారు.. సబ్జెక్ట్ లేకుండా సభకు వస్తున్నారు..చంద్రబాబు బలవంతంగా ఎమ్మెల్యే లను సభకు పంపుతున్నట్లు ఉంది. ఈరోజున సభకు వచ్చి ప్రతిపక్షం చర్చలో పాల్గొనాలని కోరుతున్నా అన్నారు ప్రసాద్ రాజు.
Read Also: Adilabad NIA Raids: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో NIA సోదాల కలకలం
తాజావార్తలు
-
Deewana OTT Deal: కంటెంట్పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్పాట్!
-
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
-
Kiran Abbavaram: థియేటర్ల నుంచి బయటకొచ్చాక నెలల తరబడి గుర్తుంటుంది.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం ప్రామిస్!
-
CM Chandrababu: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్.. రంగంలోకి సీఎం చంద్రబాబు..!
-
Vaibhav Sooryavanshi: ‘మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను’.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!