Gudivada Amarnath: పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలిగితే తాను అన్నీ వదులుకుని ఎక్కడికైనా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు. జగన్ సీఎం కాడని గత ఎన్నికల ముందు చెప్పాడని.. కానీ ఏమైందో అందరూ చూశారని.. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదని చెప్తున్నాడని.. మళ్లీ వైసీపీ గెలిచి తీరుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ జోస్యం చెప్పారు. 175 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో పవన్ కళ్యాణ్ చెప్పగలడా అని ఆయన ప్రశ్నించారు. కనీసం పవన్ కళ్యాణ్ అయిన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో చెప్పగలుగుతారా అని నిలదీశారు.
Read Also: Pawan Kalyan: పిఠాపురమా? భీమవరమా? పవర్ స్టార్ పోటీ ఎక్కడ?
Also Read
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
మరోవైపు అమరావతి రాజధాని అన్నది ఓ స్కాం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అమరావతి రైతులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. టీడీపీ వాళ్లు అమరావతి రైతులు బెదిరించి భూములను లాక్కున్నారని ఆయన విమర్శలు చేశారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న జగన్ ఆకాంక్షను ఎవరూ అడ్డుకోలేరని.. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతం నుంచి విజయవాడకు వెళ్లాలన్నా 40 కిలోమీటర్లు, గుంటూరు వెళ్లాలన్నా 40 కిలోమీటర్లు, ఎయిర్పోర్టుకు వెళ్లాలంటే 50 కి.మీ వెళ్లాలని.. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. అలాగని అమరావతి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తే ధర్నాలు చేయడం ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరమని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేయడం దురదృష్టకరమని.. దీనిపై ప్రజల్లో చర్చ జరగాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు. రాజధాని అంటే జేబులు నింపుకునే కార్యక్రమం అని టీడీపీ భావించిందని.. అందుకే ఆ పార్టీని గత ఎన్నికల్లో తిప్పికొట్టారని విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!