Gudivada Amarnath: పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలిగితే తాను అన్నీ వదులుకుని ఎక్కడికైనా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు. జగన్ సీఎం కాడని గత ఎన్నికల ముందు చెప్పాడని.. కానీ ఏమైందో అందరూ చూశారని.. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదని చెప్తున్నాడని.. మళ్లీ వైసీపీ గెలిచి తీరుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ జోస్యం చెప్పారు. 175 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో పవన్ కళ్యాణ్ చెప్పగలడా అని ఆయన ప్రశ్నించారు. కనీసం పవన్ కళ్యాణ్ అయిన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో చెప్పగలుగుతారా అని నిలదీశారు.
Read Also: Pawan Kalyan: పిఠాపురమా? భీమవరమా? పవర్ స్టార్ పోటీ ఎక్కడ?
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
మరోవైపు అమరావతి రాజధాని అన్నది ఓ స్కాం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అమరావతి రైతులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. టీడీపీ వాళ్లు అమరావతి రైతులు బెదిరించి భూములను లాక్కున్నారని ఆయన విమర్శలు చేశారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న జగన్ ఆకాంక్షను ఎవరూ అడ్డుకోలేరని.. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతం నుంచి విజయవాడకు వెళ్లాలన్నా 40 కిలోమీటర్లు, గుంటూరు వెళ్లాలన్నా 40 కిలోమీటర్లు, ఎయిర్పోర్టుకు వెళ్లాలంటే 50 కి.మీ వెళ్లాలని.. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. అలాగని అమరావతి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తే ధర్నాలు చేయడం ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరమని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేయడం దురదృష్టకరమని.. దీనిపై ప్రజల్లో చర్చ జరగాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు. రాజధాని అంటే జేబులు నింపుకునే కార్యక్రమం అని టీడీపీ భావించిందని.. అందుకే ఆ పార్టీని గత ఎన్నికల్లో తిప్పికొట్టారని విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!