Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమండ్రికి చెందిన వైద్య విద్యార్థిని (మెడికో) ప్రియాంక విషాదాంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నెల 3న రాజమండ్రి నగరంలో ప్రియాంక తన స్కూటీపై వెళ్తుండగా, మద్యం మత్తులో ఉన్న కొందరు ఆకతాయిలు కారుతో ఆమె వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. ప్రమాదం జరిగిన తీవ్రతకు ప్రియాంక కిందపడిపోగా, రాక్షసత్వంతో వ్యవహరించిన ఆ మందుబాబులు కారును ఆపకుండా ఆమె తలపై నుంచి తీసుకెళ్లారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు ఆమెను మొదట స్థానిక ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అత్యవసర విభాగానికి చెందిన ప్రత్యేక వైద్య బృందం ఆమెను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించింది. వెంటిలేటర్పై ఉంచి అత్యంత ఆధునిక వైద్య చికిత్స అందించినప్పటికీ, ఆమె పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆమె మెదడు పనిచేయడం లేదని (బ్రెయిన్ డెడ్) వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ తర్వాత పరిస్థితి మరింత విషమించడంతో ఈ రోజు మధ్యాహ్నం 3:22 గంటలకు ప్రియాంక మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
వైద్యురాలై సమాజానికి సేవ చేయాలని ఎన్నో ఆశలతో చదువుకుంటున్న కూతురు, మందుబాబుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోవడంతో ప్రియాంక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజమండ్రిలోనూ, ఆమె చదువుకుంటున్న కళాశాలలోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణమైన కారును, మద్యం మత్తులో కారు నడిపిన నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!