Gudivada Amarnath: అమరరాజా ఏపీలోనే ఉండాలా? పెట్టుబడులపై తప్పుడు ప్రచారమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: ఏపీలో పెట్టుబడులపై టీడీపీ, ఆ పార్టీ అనుకూల పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. టీడీపీని అధికారంలోకి తేవాలని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆ వార్తలు సిరాతో రాసినవి కాదని.. సారా తాగి చంద్రబాబు కోసం రాసిన వార్తలు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమర్ రాజా సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో రూ.9500 కోట్ల పెట్టుబడితో ఎంఓయూ చేసుకున్నారని.. ఆ సంస్థను ఆంద్రప్రదేశ్ నుంచి తరిమేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అమర్ రాజా సంస్థ ప్రతినిధులు ఎక్కడైనా ఏపీలో పెట్టాల్సిన పెట్టుబడులు తెలంగాణలో పెడుతున్నామని చెప్పారా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. అమర్ రాజా సంస్థ ఏపీలోనే ఉండాలనే నిబంధన ఏమైనా ఉందా అని నిలదీశారు. అమర్ రాజా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉందని.. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతోందన్నారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తలు రాసిన రెండు పేపర్లు క్షమాపణ చెప్పాలన్నారు. అమర్ రాజా సంస్థ టీడీపీ ఎంపీది కాబట్టి ప్రభుత్వంపై రాద్ధాంతం చేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. చంద్రబాబు హెరిటేజ్ ఏపీలో లేదా అని.. ఆయన్ను తమ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందా అని సూటి ప్రశ్న వేశారు.
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
Read Also: Tirumala: భక్తులకు అలర్ట్.. ఆధార్ కార్డు ఉంటేనే వైకుంఠద్వార దర్శనం
ప్రతిపక్ష పార్టీ నేతల పరిశ్రమలు ఏపీలో ఉండకూడదు అనుకుంటే చంద్రబాబు హెరిటేజ్ ఏపీలో ఉండేదా అన్నారు. పరిశ్రమలను సీఎం జగన్ ఎన్నడూ రాజకీయ కోణంలో చూడలేదన్నారు. పరిశ్రమలు ఉంటే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది సీఎం ఆలోచన అన్నారు. టీడీపీ అధికారంలోకి రాదని తెలిసి పక్క రాష్ట్రాల్లో టీడీపీ నేతలు పెట్టుబడులు పెట్టాలనే కోణంలో వార్తలు రాశారన్నారు. ఫాథర్ ఆఫ్ ఐటీ అంటూ చంద్రబాబు మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చురకలు అంటించారు. మొన్నటి వరకు చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు అన్నారని.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రజలకు చివరి ఎన్నికలు అంటున్నారని తెలిపారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోవాలని చంద్రబాబు కోరుకుంటున్నారని.. లక్షా 45 వేల కోట్ల ఎగుమతులు చేసి దేశంలో మూడో స్థానంలో రాష్ట్రం ఉందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. చంద్రబాబు16 లక్షల కోట్లకు ఎంఓయూ కుదుర్చుకుని కేవలం 2 శాతం మాత్రమే పెట్టుబడులు తెచ్చారని ఆరోపించారు.
తాజావార్తలు
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
ట్రెండింగ్
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!