Gudivada Amarnath: అమరరాజా ఏపీలోనే ఉండాలా? పెట్టుబడులపై తప్పుడు ప్రచారమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: ఏపీలో పెట్టుబడులపై టీడీపీ, ఆ పార్టీ అనుకూల పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. టీడీపీని అధికారంలోకి తేవాలని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆ వార్తలు సిరాతో రాసినవి కాదని.. సారా తాగి చంద్రబాబు కోసం రాసిన వార్తలు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమర్ రాజా సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో రూ.9500 కోట్ల పెట్టుబడితో ఎంఓయూ చేసుకున్నారని.. ఆ సంస్థను ఆంద్రప్రదేశ్ నుంచి తరిమేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అమర్ రాజా సంస్థ ప్రతినిధులు ఎక్కడైనా ఏపీలో పెట్టాల్సిన పెట్టుబడులు తెలంగాణలో పెడుతున్నామని చెప్పారా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. అమర్ రాజా సంస్థ ఏపీలోనే ఉండాలనే నిబంధన ఏమైనా ఉందా అని నిలదీశారు. అమర్ రాజా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉందని.. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతోందన్నారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తలు రాసిన రెండు పేపర్లు క్షమాపణ చెప్పాలన్నారు. అమర్ రాజా సంస్థ టీడీపీ ఎంపీది కాబట్టి ప్రభుత్వంపై రాద్ధాంతం చేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. చంద్రబాబు హెరిటేజ్ ఏపీలో లేదా అని.. ఆయన్ను తమ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందా అని సూటి ప్రశ్న వేశారు.
Also Read
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
Read Also: Tirumala: భక్తులకు అలర్ట్.. ఆధార్ కార్డు ఉంటేనే వైకుంఠద్వార దర్శనం
ప్రతిపక్ష పార్టీ నేతల పరిశ్రమలు ఏపీలో ఉండకూడదు అనుకుంటే చంద్రబాబు హెరిటేజ్ ఏపీలో ఉండేదా అన్నారు. పరిశ్రమలను సీఎం జగన్ ఎన్నడూ రాజకీయ కోణంలో చూడలేదన్నారు. పరిశ్రమలు ఉంటే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది సీఎం ఆలోచన అన్నారు. టీడీపీ అధికారంలోకి రాదని తెలిసి పక్క రాష్ట్రాల్లో టీడీపీ నేతలు పెట్టుబడులు పెట్టాలనే కోణంలో వార్తలు రాశారన్నారు. ఫాథర్ ఆఫ్ ఐటీ అంటూ చంద్రబాబు మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చురకలు అంటించారు. మొన్నటి వరకు చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు అన్నారని.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రజలకు చివరి ఎన్నికలు అంటున్నారని తెలిపారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోవాలని చంద్రబాబు కోరుకుంటున్నారని.. లక్షా 45 వేల కోట్ల ఎగుమతులు చేసి దేశంలో మూడో స్థానంలో రాష్ట్రం ఉందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. చంద్రబాబు16 లక్షల కోట్లకు ఎంఓయూ కుదుర్చుకుని కేవలం 2 శాతం మాత్రమే పెట్టుబడులు తెచ్చారని ఆరోపించారు.
తాజావార్తలు
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!