Dadisetti Raja: 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన సముద్రంలో కలిసిపోవడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dadisetti Raja Fires On Pawan Kalyan: తన వారాహి యాత్రలో భాగంగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యాలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా.. వైసీపీ, సీఎం జగన్ని టార్గెట్ చేసుకుని పవన్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. దీంతో.. వైసీపీ నేతలు తమదైన శైలిలో పవన్పై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా సైతం పవన్పై విరుచుకుపడ్డారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాళ్ళపురంలో నిర్వహించిన జగనన్న సురక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకుని పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. పిచ్చి ప్రేలాపనలు తప్పితే, పవన్కి రాష్ట్రం గురించి ఏమీ తెలియదన్నారు. పవన్ మాటల్లో జగన్పై ఈర్ష, అసూయ మాత్రమే కనిపిస్తున్నాయని.. అతని కళ్లల్లో మాత్రం ఓటమి కనిపిస్తోందని పేర్కొన్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు సముద్రంలో కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీ రాష్ట్రానికి జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
- AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
అంతకుముందు కూడా.. ఏపీ వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి దాడిశెట్టి రాజా తిప్పికొట్టారు. అన్నం తినేవాడు ఎవడైనా వాలంటీర్లను తిడతాడా..? అంటూ ధ్వజమెత్తారు. గడ్డి తినే వాళ్ళు మాత్రమే వాలంటీర్లపై నోరు పారేసుకుంటారని విమర్శించారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవ చేశారని.. పవన్ చేసిన వ్యాఖ్యలతో అతనికి రాష్ట్రంపై ఏమాత్రం అవగాహన లేదని తేలిపోయిందని అన్నారు. పవన్ చెప్పేవన్నీ అభూతకల్పనలు, అబద్ధాలేనని విరుచుకుపడ్డారు. పవన్ గంటలో నిర్ణయం, పూటకో మాట మాట్లాడుతున్నారని.. పవన్ను పార్టీ నాయకులు, కార్యకర్తలు మానసిక వైద్యుడికి చూపించాలని సూచించారు. ఎక్కడ పోటీ చేస్తాడో పవన్కే క్లారిటీ లేదన్న ఆయన.. పవన్ ఎమ్మెల్యే అవ్వాలన్నా, సీఎం అవ్వాలన్నా ప్రజలు ఓట్లు వెయ్యాలని పేర్కొన్నారు. గతంలో టీడీపీ, పవన్ కలిసి మేనిఫెస్టో రూపొందించారని.. ఆ హామీలు అమలు చేయలేకపోతే చంద్రబాబును నిలదీశావా? అని పవన్ని ప్రశ్నించారు. చంద్రబాబు తనకు ప్యాకేజీ సరిగా ఇవ్వడేమోనన్న భయంతోనే.. పవన్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి రాజా మండిపడ్డారు.
Kishan Reddy: ప్రకృతిని కాపాడుకుందాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం..
తాజావార్తలు
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్కు పాక్ కోర్టులో భారీ ఊరట..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!