Ambati Rambabu: ప్రాజెక్ట్ల పైనే కాదు, నీటి గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ప్రాజెక్ట్ల గురించే కాదు.. అసలు నీటి గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదంటూ ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎంపీలు కోటగిరి, మార్గాని భరత్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించిన ఆయన.. ప్రాజెక్టు పనులపై వివరించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.. 1995లో ముఖ్య మంత్రి అయ్యి తర్వాతి కాలంలో 14 ఏళ్లు సీయంగా వున్న చంద్రబాబు ఎప్పుడైనా పోలవరం గురించి మాట్లాడారా..? అని నిలదీశారు.. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకి లేదన్న ఆయన.. ప్రాజెక్ట్ ల గురించే కాదు, నీటి గురించి అసలు మాట్లాడే అర్హత లేదన్నారు.. ఆయన పాలనలో వర్షాలు పడవు అంటూ ఎద్దేవా చేశారు.. పోలవరంలో 72శాతం పనులు పూర్తి చేశామని చంద్రబాబు అనడం పచ్చి అబద్ధం అని ఫైర్ అయ్యారు.
Read Also: Mahesh Babu: అప్పుడు మహేశ్ బాబుకి హిట్ కావాలి, ఇప్పుడు మహేశ్ అంటేనే హిట్…
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
ఇక, ప్రతి పక్షాలు, వైసీపీకి వ్యతిరేకంగా వున్నవారు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు సర్వ నాశనం చేశారని ఆరోపించిన ఆయన.. కాఫర్ డ్యామ్ లు పూర్తి చేయకుండా డయా ఫ్రమ్ వాల్ కట్టడం తెలివి తక్కువ తనం అని మండిపడ్డారు.. అప్పట్లో దాని విలువ 4 వందలు కోట్లు.. హెడ్ వర్క్ విలువ 5,943 కోట్లు.. టీడీపీ హయాంలోనే 3,591 మాత్రమే ఖర్చు చేశారు.. కానీ, 7,422 కోట్ల అంచనాకి ప్రాజెక్టు వెళ్లిపోయిందన్నారు.. చంద్రబాబు అజ్ఞానం వల్ల ప్రాజెక్ట్ పనులు కుంటుపడ్డాయని విమర్శించారు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అత్యధికంగా ఖర్చు చేసింది వైసీపీ మాత్రమే అని స్పష్టం చేశారు.. అత్యధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ పోలవరం.. శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత వైసీపీ తీసుకుందన్న ఆయన.. పొరపాట్లకు తావులేకుండా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ఉందని.. పోలవరం ప్రాజెక్ట్ ను ప్రారంభించబోయేది సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని ప్రకటించారు.. మరోవైపు.. పోలవరంపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!