విజయవాడలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ నేత బుద్దా వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.విజయవాడ వన్ టౌన్ పీఎస్ కు బుద్దా వెంకన్నను తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు అడ్డుపడ్డారు టీడీపీ కార్యకర్తలు.. బుద్దా అనుచరులు.
బుద్ధా వెంకన్నపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 153, 505, 506 సెక్షన్ల కింద FIR నమోదయింది. బుద్దాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మైలవరపు దుర్గారావు. కాసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని, రాష్ట్ర డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్నను అరెస్ట్ చేశారు. గుడివాడ వ్యవహారంపై మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పైగా మంత్రిని చంపుతానంటూ రక్తం కళ్ల చూస్తానంటూ విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు అందగా వివరణ కోరేందుకు బుద్ధా వెంకన్న ఇంటికి వెళ్లారు. అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు బుద్దా వెంకన్నను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.