Kidney Racket Scam: కలకలం రేపుతోన్న కిడ్నీ మాఫియా.. మూలాలపై పోలీసుల ఫోకస్
- గుంటూరులో కిడ్నీ మాఫియా చేతిలో మోసపోయిన మధుబాబు..
- ఫోకస్ పెట్టిన గుంటూరు
- బెజవాడ పోలీసులు..
- గతంలో కూడా కిడ్నీ అమ్మకాలకు సంబంధించిన మధ్యవర్తుల వ్యవహారంపై భవానీపురం పోలీసులు రెండు కేసులు..
- మళ్ళీ బెజవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కార్యకలాపాలు..
- గుంటూరులో బయటపడటంతో బెజవాడ పోలీసులు అప్రమత్తయ్యారు..
Kidney Racket Scam: గుంటూరులో కిడ్నీ మాఫియా చేతిలో మోసపోయిన మధుబాబు వ్యవహారంపై బెజవాడ పోలీసులు ఫోకస్ పెట్టారు. కేసు గుంటూరు పోలీసులు నమోదు చేసినప్పటికీ వ్యవహారం అంతా బెజవాడ కేంద్రంగా జరగటంతో పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. గతంలో కూడా కిడ్నీ అమ్మకాలకు సంబంధించిన మధ్యవర్తుల వ్యవహారంపై భవానీపురం పోలీసులు రెండు కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఈ కేసుల్లో తహసిల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మధ్యవర్తులను అరెస్టు చేశారు. ఇక ఆ తర్వాత స్వర ఆసుపత్రిలో కిడ్నీ అమ్మకానికి సంబంధించిన ఘటన కూడా కలకలం రేపింది. ఇక ఇప్పుడు తాజాగా మళ్ళీ బెజవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కార్యకలాపాలు గుంటూరులో బయటపడటంతో బెజవాడ పోలీసులు అప్రమత్తయ్యారు.
Read Also: AP Crime: కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య.. అసలు విషయం తెలిస్తే షాకే..
గుంటూరుకు చెందిన మధుబాబు కిడ్నీని కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందిన గార్లపాటి వెంకటస్వామికి గత నెల జూన్ లో విజయవాడ విజయా ఆసుపత్రిలో ఆపరేషన్ ద్వారా మార్పిడి చేశారు. వీరిద్దరు బంధువులు అంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి వాటి సాయంతో కిడ్నీ మార్పిడి చేయించారు. మధ్య వర్తులుగా ఖాదర్ బాషా, వెంకట్ లు వ్యవహరించినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఇద్దరి వ్యవహారాల గురించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఖాదర్ ఇప్పటికే పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వెంకట్ ఆచూకీ తెలుసుకుని విచారణ చేయనున్నారు. కిడ్నీమార్పిడి వ్యవహారంలో ఈ ఇద్దరికీ 3 లక్షల రూపాయల వరకు ఇచ్చినట్టు ప్రాధమిక విచారణలో పోలీసులు గుర్తించినట్టు సమాచారం. దీంతో గతంలో ఈ ఇద్దరి వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
Read Also: Sikhs For Justice: ఖలిస్తానీ ఉగ్రసంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’’పై మరో 5 ఏళ్లు బ్యాన్..
ఆపరేషన్ చేసిన విజయా ఆసుపత్రిపై గతంలో వచ్చిన ఫిర్యాదులను కూడా పోలీసులు బయటకు తీస్తున్నారు. నగరంలో అనేక మంది కిడ్నీ మాఫియా రాకెట్ లో మధ్యవర్తులగా వ్యవహరిస్తూ ప్రధాన ఆసుపత్రులకు ఏజంట్లుగా ఉండి కిడ్నీలను మార్కెటింగ్ చేస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. విజయా ఆసుపత్రి, డాక్టర్ శరత్ పై కూడా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎడమ కిడ్నీ ఇస్తానంటే కుడి కిడ్నీ తొలగించారని, 30 లక్షలు ఇస్తానని మోసం చేసినట్టు ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నీ తీసుకున్న వెంకటస్వామిని కూడా పోలీసులు విచారణ జరిపి ఆర్థిక లావాదేవీలపై నివేదిక సిద్ధం చేయనన్నట్టు తెలిసింది. కిడ్నీ మాఫియా ఏజంట్లుకు అండగా ఉంటున్న ఆసుపత్రుల వివరాలను కూడా తీసేందుకు పోలీసులు సిద్ధమయ్యారని సమాచారం. కిడ్నీ మాఫియా విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో గుంటూరు, విజయవాడ పోలీసులు సమన్వయంతో కేసు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Editor Madhu Reddy: చిన్న వయసులోనే దూరమైన ప్రతిభావంతుడు.. గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
-
Gold In India: ఇండియాలో బంగారమే బంగారం.. బయటపడ్డ 42.5 టన్నుల గోల్డ్.. తవ్వకాలకు అంతా సిద్ధం..
-
House Construction: మీరు ఇంటిని ఏ డబ్బుతో కడుతున్నారు..? స్వాధీనం తప్పుదు..!
-
Rammohan Naidu : మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ చేసిన క్షమించరాని పాపం
-
KKR vs RR: రింకు మెరుపు ఇన్నింగ్స్.. ఎట్టకేలకు భోణీ కొట్టిన కేకేఆర్..
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?