తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపు.. ఎవరికి ఎంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపును కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఖరారు చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఈనెల 15 వరకు 112.5 టీఎంసీల నీటి వినియోగానికి బోర్డు ఆమోదం తెలిపింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు రెండు ప్రాజెక్టుల కింద ఏపీ, తెలంగాణ కలిపి 294.33 టీఎంసీల నీటిని వాడుకున్నాయి. బోర్డు తాజా నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా మరో 407 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం దక్కించుకున్నాయి.
Read Also: పీఆర్సీపై సీఎస్ సమీర్ శర్మ కీలక ప్రకటన
Also Read
ఈ ఏడాది జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు 207 టీఎంసీల నీటి వినియోగానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు ఇవ్వగా… 212.43 టీఎంసీలు వాడుకుంది. 169 టీఎంసీల నీటి వినియోగానికి తెలంగాణ సర్కారు ప్రతిపాదనలు ఇవ్వగా కేవలం 81.85 టీఎంసీలు మాత్రమే వాడుకుంది. రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటికి ఆమోదం తెలిపిన బోర్డు… ఈనెల 15 వరకు ఏపీ 23.68 టీఎంసీలు, తెలంగాణ 88.82 టీఎంసీలు వాడుకునేందుకు ఆమోదం తెలిపింది. డిసెంబర్ 15 తర్వాత రెండు రిజర్వాయర్లలోని కనీస నీటిమట్టాలపై 145 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!