Kotamreddy Sridhar Reddy: సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నా.. ఆ ముగ్గురి గురించి జగనే చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kotamreddy Sridhar Reddy Reacts On YCP Suspension: తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా స్పందించారు. తన సస్పెన్షన్ను స్వాగతిస్తున్నానని అన్నారు. తాను రెండు నెలల ముందే వైసీపీకి దూరంగా ఉన్నానని చెప్పారు. కానీ.. ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొన్నారు. వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ నుండి సస్పెండ్ చేయడంపై ముఖ్యమంత్రి జగనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కోట్ల రూపాయలు తీసుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు సరికావని తిప్పికొట్టారు. టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్లు ఇచ్చారు సజ్జల స్పష్టం చేయాలని కోరారు. పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.
S Jaishankar: ఖలిస్తానీవాదుల దాడి.. యూకేకు గట్టిగా ఇచ్చిపడేసిన జైశంకర్..
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
కాగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ వ్యవహారం రచ్చ రేపింది. ఈ క్రాస్ ఓటింగ్ను సీరియస్గా తీసుకున్న వైసీపీ హైకమాండ్.. అంతర్గతంగా దర్యాప్తు చేసి నలుగురు ఎమ్మెల్యేలని గుర్తించింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి ఘాటుగా బదులిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనని వైసీపీ గానీ, టీడీపీ గానీ ఓటు అడగలేదని.. ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తానని చెప్పి ఓటు వేశానన్నారు. చేతిలో అధికారం ఉందని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, పార్టీలో పెత్తందారీ విధానం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తానెక్కడా తప్పు చేయలేదని, సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని, విలువలే ముఖ్యమంటూ ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!