S Jaishankar: ఖలిస్తానీవాదుల దాడి.. యూకేకు గట్టిగా ఇచ్చిపడేసిన జైశంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: యూకే లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడిపై విదేశాంగ మంత్రి జైశంకర్ మౌనం వీడారు. యూకేకు బుద్ధి వచ్చే విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం, బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు, ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కు మద్దతుగా, భారత్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. రాయబార కార్యాలయంపై దాడి చేసి భారత జెండాను అవమానపరిచారు.
Read Also: Eric Garcetti: భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం..
Also Read
- Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
ఈ ఘటనపై మాట్లాడుతూ.. భద్రతా బాధ్యతలను నెరవేర్చడంలో యూకే ప్రభుత్వ విఫలమైందని ఆరోపించారు. దౌత్యవేత్తలు తమ విధులను నిర్వర్తించడానికి, హై కమిషన్ కు భద్రత కల్పించడం ఆ దేశాల బాధ్యత కానీ యూకే ఆ బాధ్యతను నెరవేర్చలేదు. దీనిపై బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరిపాం అని జైశంకర్ అన్నారు.చాలా దేశాలు భద్రత గురించి క్యాజువల్ గా ఉంటాయి. వారు తమ సొంత భద్రత గురించి ఆలోచిస్తారు తప్పితే ఇతరుల భద్రత గురించి భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉంటారని యూకేను ఉద్దేశించి మాస్ కామెంట్స్ చేశారు. మేము ఇలాంటి ప్రమాణాలను అంగీకరించబోమని జైశంకర్ అన్నారు.
ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నాయకుడి కోసం పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత వారం నుంచి అతను తప్పించుకుతిరుగుతున్నాడు. ఖలిస్తాన్ పేరుతో పంజాబ్ యువతను రెచ్చగొట్టమే కాకుండా, పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకోవడంతో పాటు పాక్ నుంచి ఆయుధాలు పొందినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయనపై పంజాబ్ పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారంటూ కెనడా, యూకే, ఆస్త్రేలియాలోని ఖలిస్తానీ అనుకూలవాదులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం యూకేలోని భారత ఎంబసీపై దాడులు చేశారు. ఫ్రీ అమృత్ పాల్ సింగ్, వీవాంట్ జస్టిస్, వీస్టాండ్ విత్ అమృత్ పాల్ సింగ్ అంటూ నినాదాలు చేశారు. ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ భారత జాతీయ పతాకాన్ని అవమానపరచాలని ప్రయత్నించారు.
తాజావార్తలు
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
-
Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
ట్రెండింగ్
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!