S Jaishankar: ఖలిస్తానీవాదుల దాడి.. యూకేకు గట్టిగా ఇచ్చిపడేసిన జైశంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: యూకే లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడిపై విదేశాంగ మంత్రి జైశంకర్ మౌనం వీడారు. యూకేకు బుద్ధి వచ్చే విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం, బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు, ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కు మద్దతుగా, భారత్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. రాయబార కార్యాలయంపై దాడి చేసి భారత జెండాను అవమానపరిచారు.
Read Also: Eric Garcetti: భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం..
Also Read
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
ఈ ఘటనపై మాట్లాడుతూ.. భద్రతా బాధ్యతలను నెరవేర్చడంలో యూకే ప్రభుత్వ విఫలమైందని ఆరోపించారు. దౌత్యవేత్తలు తమ విధులను నిర్వర్తించడానికి, హై కమిషన్ కు భద్రత కల్పించడం ఆ దేశాల బాధ్యత కానీ యూకే ఆ బాధ్యతను నెరవేర్చలేదు. దీనిపై బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరిపాం అని జైశంకర్ అన్నారు.చాలా దేశాలు భద్రత గురించి క్యాజువల్ గా ఉంటాయి. వారు తమ సొంత భద్రత గురించి ఆలోచిస్తారు తప్పితే ఇతరుల భద్రత గురించి భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉంటారని యూకేను ఉద్దేశించి మాస్ కామెంట్స్ చేశారు. మేము ఇలాంటి ప్రమాణాలను అంగీకరించబోమని జైశంకర్ అన్నారు.
ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నాయకుడి కోసం పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత వారం నుంచి అతను తప్పించుకుతిరుగుతున్నాడు. ఖలిస్తాన్ పేరుతో పంజాబ్ యువతను రెచ్చగొట్టమే కాకుండా, పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకోవడంతో పాటు పాక్ నుంచి ఆయుధాలు పొందినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయనపై పంజాబ్ పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారంటూ కెనడా, యూకే, ఆస్త్రేలియాలోని ఖలిస్తానీ అనుకూలవాదులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం యూకేలోని భారత ఎంబసీపై దాడులు చేశారు. ఫ్రీ అమృత్ పాల్ సింగ్, వీవాంట్ జస్టిస్, వీస్టాండ్ విత్ అమృత్ పాల్ సింగ్ అంటూ నినాదాలు చేశారు. ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ భారత జాతీయ పతాకాన్ని అవమానపరచాలని ప్రయత్నించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
-
Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
-
Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!