S Jaishankar: ఖలిస్తానీవాదుల దాడి.. యూకేకు గట్టిగా ఇచ్చిపడేసిన జైశంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: యూకే లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడిపై విదేశాంగ మంత్రి జైశంకర్ మౌనం వీడారు. యూకేకు బుద్ధి వచ్చే విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం, బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు, ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కు మద్దతుగా, భారత్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. రాయబార కార్యాలయంపై దాడి చేసి భారత జెండాను అవమానపరిచారు.
Read Also: Eric Garcetti: భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం..
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
ఈ ఘటనపై మాట్లాడుతూ.. భద్రతా బాధ్యతలను నెరవేర్చడంలో యూకే ప్రభుత్వ విఫలమైందని ఆరోపించారు. దౌత్యవేత్తలు తమ విధులను నిర్వర్తించడానికి, హై కమిషన్ కు భద్రత కల్పించడం ఆ దేశాల బాధ్యత కానీ యూకే ఆ బాధ్యతను నెరవేర్చలేదు. దీనిపై బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరిపాం అని జైశంకర్ అన్నారు.చాలా దేశాలు భద్రత గురించి క్యాజువల్ గా ఉంటాయి. వారు తమ సొంత భద్రత గురించి ఆలోచిస్తారు తప్పితే ఇతరుల భద్రత గురించి భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉంటారని యూకేను ఉద్దేశించి మాస్ కామెంట్స్ చేశారు. మేము ఇలాంటి ప్రమాణాలను అంగీకరించబోమని జైశంకర్ అన్నారు.
ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నాయకుడి కోసం పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత వారం నుంచి అతను తప్పించుకుతిరుగుతున్నాడు. ఖలిస్తాన్ పేరుతో పంజాబ్ యువతను రెచ్చగొట్టమే కాకుండా, పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకోవడంతో పాటు పాక్ నుంచి ఆయుధాలు పొందినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయనపై పంజాబ్ పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారంటూ కెనడా, యూకే, ఆస్త్రేలియాలోని ఖలిస్తానీ అనుకూలవాదులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం యూకేలోని భారత ఎంబసీపై దాడులు చేశారు. ఫ్రీ అమృత్ పాల్ సింగ్, వీవాంట్ జస్టిస్, వీస్టాండ్ విత్ అమృత్ పాల్ సింగ్ అంటూ నినాదాలు చేశారు. ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ భారత జాతీయ పతాకాన్ని అవమానపరచాలని ప్రయత్నించారు.
తాజావార్తలు
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..