Kodali Nani: వంగవీటి రాధా పోటీ చేయడు.. కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani Interesting Comments On Vangaveeti Radha: మాజీమంత్రి కొడాలి నాని తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా ఎట్టి పరిస్థితుల్లోనూ గుడివాడ నుంచి పోటీ చేయడని, రాధా తన సొంత తమ్ముడి లాంటివాడని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళు పూర్తి కావడంతో.. కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల నేతలు హాజరయ్యారు. స్వర్గీయ వైయస్సార్ విగ్రహానికి కొడాలి నాని నివాళులర్పించి అనంతరం పార్టీ నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో వచ్చిన తన గెలుపుల్లో కాపులదే సగభాగమని అన్నారు.
Seediri Appalaraju: బాబు విజనరీ కాదు, విస్తరాకుల కట్ట.. జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారు
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
చచ్చినా రాజకీయాల కోసం కాపులను విమర్శించనని కొడాలి నాని స్పష్టం చేశారు. తాను మాట్లాడిన వ్యాఖ్యల్లో టీడీపీ వాళ్లు కట్ పేస్ట్ చేసి.. వీడియోలు వదిలారని క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోలు చూసి జనసైనికులు స్పందిస్తున్నారని చెప్పారు. తన జీవితంలో ఇప్పటివరకు రంగాకు వ్యతిరేకంగా జరిగిన ఏ కార్యక్రమంలోనూ తాను పాల్గొనలేదని పేర్కొన్నారు. మహానాడు వేదికపై ఎన్టీఆర్ పక్కన పప్పు, తుప్పు ఫోటోల ఏర్పాటు చేయడంపై మాత్రమే తాను స్పందించానని అన్నారు. వారసుడు బాలయ్య ఫోటో లేకపోయినా.. అచ్చెం లాంటి స్క్రాప్ల ఫోటోలను ఎందుకు పెట్టారని తాను ప్రశ్నించానని స్పష్టతనిచ్చారు. టీడీపీ వాళ్లు చూపించిన అబద్ధాన్ని కాపు సోదరులు నమ్మలేదని తెలిపారు. రేపు జనం కూడా టీడీపీని కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ చేసిన నీచాది నీచుల మాయలో పడొద్దని సూచించారు.
Venkatesh: నంది అవార్డులపై వెంకటేశ్ కామెంట్స్.. ఇస్తే ఇవ్వొచ్చు, లేదంటే లేదు
రాజకీయాల్లో ఎప్పుడు వచ్చామనేది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అన్న విధంగా జగన్ పాలన చేస్తున్నారని కొడాలి నాని పేర్కొన్నారు. శక్తివంతమైన సోనియానే ఎదిరించి నిలబడిన జగన్ను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడానికి.. చంద్రబాబు ప్రతిపక్ష హోదా కాపాడుకోవడానికే కలిసి పోటీ చేస్తున్నారన్నారు. అందరి కోసం పనిచేస్తూ.. జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. వైఎస్ఆర్ భూమిని వదిలి స్వర్గానికి వెళ్లిపోతే రాష్ట్రం నష్టపోయిందన్నారు. వైఎస్ఆర్ బతికి ఉంటే.. తాను రెండు ముక్కలైన సరే, రాష్ట్రాన్ని విడిపోనిచ్చేవారు కాదన్నారు. ఇప్పుడు జగన్కు కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ ఉందన్నారు.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!