Andhra Pradesh: ఏపీలో మరో ఉద్దానం.. కిడ్నీ వ్యాధితో 35మందికి పైగా మృత్యువాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం తరహాలో ఏపీలో మరో ప్రాంతంలోని ప్రజలు కిడ్నీ వ్యాధితో అల్లాడిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండల వాసులు కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కిడ్నీ వ్యాధితో 35 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క ఈ నెలలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. చీమలపాడు, దీప్లానగర్, చైతన్య నగర్, మాన్ సింగ్ తండా, రేపూడి తండా, కంభంపాడు, లక్ష్మీపురం, పెద్దతండా సహా 15 గిరిజన గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ గ్రామాల్లో దాదాపు ప్రతి ఇంట్లో కిడ్నీ బాధితులు ఉన్నారని స్థానిక అధికారులు చెప్తున్నారు. దీంతో భూములు అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
ఎ.కొండూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడేందుకు తాగునీరే కారణమని స్థానికులు ఆరోపిస్తు్న్నారు. ఇక్కడి తాగునీటిలో అధికంగా ఫ్లోరైడ్, సిలికాన్ ఉంటున్నాయని.. ఈ నీటిని తాగడానికి, వంటకు ఉపయోగించడంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. గత ప్రభుత్వ హయాంలో ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేసేవాళ్లు అని.. కానీ ఇప్పుడు ట్యాంకర్లతో నీటి సరఫరా నిలిచిపోయిందని.. ఆర్వో ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. తమకు తాగునీటి కోసం కృష్ణా జలాలు పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎ.కొండూరు మండలంలోని పలు గ్రామాలకు తాగునీటి కోసం కృష్ణా జలాలను అందించే ప్రాజెక్టుకు రూ.38 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినా ప్రభుత్వం ఆమోదించలేదు. దీంతో చాలా మంది గ్రామాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.
Also Read
- Off The Record : జోగి రమేష్కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
- Off The Record : సిక్కోలు నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా?
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
Read Also: Party Funds: గుప్త విరాళాల్లో వైసీపీ టాప్.. పార్టీల విరాళాలను వెల్లడించిన ఏడీఆర్
అటు గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ బాధితులు చనిపోతే రూ.10వేలు పరిహారం ఇచ్చేవాళ్లు అని.. కానీ ఇప్పుడు వాటిని ఆపేశారని.. డయాలసిస్ చేయించుకున్న వారికి మాత్రం రూ.10వేల పరిహారం కొనసాగుతోందని స్థానికులు వివరించారు. అటు కిడ్నీ బాధితులకు గతంలో ఫించన్ ఇచ్చే వాళ్లు అని.. ఇప్పుడు బాధితులు పెరిగినా కొత్త వారికి ఫించన్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. కాగా ఎ.కొండూరులో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉందని.. కనీసం కిడ్నీవేర్ సెంటర్నైనా ఏర్పాటు చేయాలని.. నెప్రాలజిస్ట్, ఇద్దరు జనరల్ ఫిజిషియన్లను కేటాయించాలని బాధితులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!