Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె ఉత్సవాలు అత్యంత వైభవంగా కోలాహలంగా సాగుతున్నాయి. ఆషాఢ మాసం ఐదవ రోజు ఉత్సవాలతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు, సారె సమర్పించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా మహిళా భక్తులు ఇంద్రకీలాద్రికి వెల్లువలా పోటెత్తారు. ఘాట్ రోడ్, కనకదుర్గ నగర్ మార్గాల ద్వారా ఉదయం 7 గంటల నుంచే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికే దాదాపు 65 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, వారిలో కేవలం ఆషాఢ సారె సమర్పించేందుకే 57 బృందాలుగా 23,916 మంది భక్తులు విచ్చేశారు.
ఈ భారీ రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఆలయ అధికారులు సరికొత్త సాంకేతికతను ఉపయోగించారు. డిజిటల్ స్కానింగ్ విధానం ద్వారా క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ భక్తుల రద్దీని నియంత్రించారు. కింద రిజిస్ట్రేషన్ కాగానే కొండపై ఉన్న స్కానింగ్ పాయింట్కు తక్షణ సమాచారం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనివల్ల భక్తుల నిరీక్షణ సమయం తగ్గింది. ముఖ్యంగా సారె సమర్పించే భక్తుల సౌకర్యార్థం ‘భవాని అనుగ్రహ దర్శన్’ (రూ. 100) క్యూ లైన్ను పూర్తిగా వారికే కేటాయించారు. అలాగే ఇతర క్యూ లైన్లలో కూడా సారె భక్తులను అనుమతించారు. దీంతో మహామండపం 6వ అంతస్తు భక్తులతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. వచ్చిన భక్తులందరికీ ఆలయ అధికారులు ఉచిత ఆశీర్వచనం, ప్రసాద వితరణ చేశారు.
Also Read
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి అంతరాలయ దర్శనాలను, అలాగే ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. అన్ని రకాల దర్శన టికెట్లను రద్దు చేసి ఉచిత దర్శనాలుగా మార్చారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలోనే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా భక్తులకు చల్లని తాగునీరు అందించారు. ఈ ఏర్పాట్లన్నింటినీ ఆలయ ఈవో శీనా నాయక్ స్వయంగా క్షేత్రస్థాయిలో బ్యాటరీ వాహనాలు, ప్రోటోకాల్ కార్యాలయం, ప్రధాన ఆలయ పరిసరాల్లో పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..