Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె ఉత్సవాలు అత్యంత వైభవంగా కోలాహలంగా సాగుతున్నాయి. ఆషాఢ మాసం ఐదవ రోజు ఉత్సవాలతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు, సారె సమర్పించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా మహిళా భక్తులు ఇంద్రకీలాద్రికి వెల్లువలా పోటెత్తారు. ఘాట్ రోడ్, కనకదుర్గ నగర్ మార్గాల ద్వారా ఉదయం 7 గంటల నుంచే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికే దాదాపు 65 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, వారిలో కేవలం ఆషాఢ సారె సమర్పించేందుకే 57 బృందాలుగా 23,916 మంది భక్తులు విచ్చేశారు.
ఈ భారీ రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఆలయ అధికారులు సరికొత్త సాంకేతికతను ఉపయోగించారు. డిజిటల్ స్కానింగ్ విధానం ద్వారా క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ భక్తుల రద్దీని నియంత్రించారు. కింద రిజిస్ట్రేషన్ కాగానే కొండపై ఉన్న స్కానింగ్ పాయింట్కు తక్షణ సమాచారం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనివల్ల భక్తుల నిరీక్షణ సమయం తగ్గింది. ముఖ్యంగా సారె సమర్పించే భక్తుల సౌకర్యార్థం ‘భవాని అనుగ్రహ దర్శన్’ (రూ. 100) క్యూ లైన్ను పూర్తిగా వారికే కేటాయించారు. అలాగే ఇతర క్యూ లైన్లలో కూడా సారె భక్తులను అనుమతించారు. దీంతో మహామండపం 6వ అంతస్తు భక్తులతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. వచ్చిన భక్తులందరికీ ఆలయ అధికారులు ఉచిత ఆశీర్వచనం, ప్రసాద వితరణ చేశారు.
Also Read
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి అంతరాలయ దర్శనాలను, అలాగే ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. అన్ని రకాల దర్శన టికెట్లను రద్దు చేసి ఉచిత దర్శనాలుగా మార్చారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలోనే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా భక్తులకు చల్లని తాగునీరు అందించారు. ఈ ఏర్పాట్లన్నింటినీ ఆలయ ఈవో శీనా నాయక్ స్వయంగా క్షేత్రస్థాయిలో బ్యాటరీ వాహనాలు, ప్రోటోకాల్ కార్యాలయం, ప్రధాన ఆలయ పరిసరాల్లో పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!