Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
- సరూర్నగర్ సభ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్
- సోనియా గాంధీ అంశాన్ని గుర్తుచేసిన జగ్గారెడ్డి
- గ్రూప్-1 పేపర్ లీక్పై బీఆర్ఎస్ను టార్గెట్
- గాంధీ కుటుంబం మాట నిలబెడుతుందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరూర్ నగర్ సభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కేటీఆర్ ‘డెత్ డిక్లరేషన్’ అంటూ మాట్లాడటంపై ఆయన తీవ్ర కౌంటర్ ఇచ్చారు. అసలు కేటీఆర్కు ఏమాత్రం రాజకీయ నియత్ (నిజాయితీ) ఉందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయం గాంధీ కుటుంబానిదైతే.. విలువలు లేని రాజకీయాలు కేసీఆర్ కుటుంబానివని మండిపడ్డారు.
సోనియా గాంధీ కాళ్లు మొక్కిన సంగతి మర్చిపోయారా?
ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియా గాంధీకి తన చర్మం వొలిచి చెప్పులు కుట్టిస్తానని కేసీఆర్ అన్న మాటలను జగ్గారెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కిన సంగతిని ఇప్పుడు ఎలా మర్చిపోతారని నిలదీశారు. నాడు కాళ్లు మొక్కి, ఇప్పుడేమో అదే గాంధీ కుటుంబంపై డెత్ డిక్లరేషన్ ప్రకటిస్తావా అంటూ కేటీఆర్పై మండిపడ్డారు. కేటీఆర్ రక్తంలో ఎక్కడా నిజాయితీ, కృతజ్ఞతా భావం లేవని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆ కుటుంబం నాశనాన్ని కోరుకోవడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం
- Police Medals : తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాల పంట.. విజేతల పూర్తి జాబితా ఇదే.!
- Telangana Cabinet Decisions : రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు, సన్నాలకు బోనస్, ఈవీ ఆటోలకు భారీ సబ్సిడీ.!
- Smart Ration Card Status: మీరు స్మార్ట్ రేషన్ కార్డుకు అర్హులేనా..? ఇలా చెక్ చేసుకోండి..
మాట ఇస్తే నిలబెట్టుకునేది రాహుల్ గాంధీ.. మోసం చేసేది కేసీఆర్ కుటుంబం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు, కేటీఆర్ అశోక్ నగర్ వెళ్లి ఏ రోజైనా నిరుద్యోగులకు సమాధానం చెప్పారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. నాడు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుని, ఇవాళ నీతులు చెబుతున్నారని విమర్శించారు. గాంధీ కుటుంబం ఏనాడైనా మాట ఇస్తే దానికి కట్టుబడి నిలబడుతుందని, కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం మాట ఇస్తే మోసం చేయడమే అలవాటుగా మార్చుకుందని దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఏ స్థాయికైనా దిగజారే నైజం కేసీఆర్ కుటుంబానిదేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Govt on Congress: ‘‘మెలోని’’పై కాంగ్రెస్ జోక్ వివాదం.. స్పందించిన విదేశాంగ శాఖ..
-
Vijay Mallya: వేల కోట్లు ఎగగొట్టి పోయిన విజయ్ మాల్యా చుట్టూ మళ్లీ హాట్ టాపిక్.. ఎంత వసూలైంది? ఎంత మిగిలిందంటే?
-
CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం
-
Yogi Adityanath: “1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే”.. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..
-
CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!