Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
- సరూర్నగర్ సభ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్
- సోనియా గాంధీ అంశాన్ని గుర్తుచేసిన జగ్గారెడ్డి
- గ్రూప్-1 పేపర్ లీక్పై బీఆర్ఎస్ను టార్గెట్
- గాంధీ కుటుంబం మాట నిలబెడుతుందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరూర్ నగర్ సభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కేటీఆర్ ‘డెత్ డిక్లరేషన్’ అంటూ మాట్లాడటంపై ఆయన తీవ్ర కౌంటర్ ఇచ్చారు. అసలు కేటీఆర్కు ఏమాత్రం రాజకీయ నియత్ (నిజాయితీ) ఉందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయం గాంధీ కుటుంబానిదైతే.. విలువలు లేని రాజకీయాలు కేసీఆర్ కుటుంబానివని మండిపడ్డారు.
సోనియా గాంధీ కాళ్లు మొక్కిన సంగతి మర్చిపోయారా?
ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియా గాంధీకి తన చర్మం వొలిచి చెప్పులు కుట్టిస్తానని కేసీఆర్ అన్న మాటలను జగ్గారెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కిన సంగతిని ఇప్పుడు ఎలా మర్చిపోతారని నిలదీశారు. నాడు కాళ్లు మొక్కి, ఇప్పుడేమో అదే గాంధీ కుటుంబంపై డెత్ డిక్లరేషన్ ప్రకటిస్తావా అంటూ కేటీఆర్పై మండిపడ్డారు. కేటీఆర్ రక్తంలో ఎక్కడా నిజాయితీ, కృతజ్ఞతా భావం లేవని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆ కుటుంబం నాశనాన్ని కోరుకోవడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
- Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
మాట ఇస్తే నిలబెట్టుకునేది రాహుల్ గాంధీ.. మోసం చేసేది కేసీఆర్ కుటుంబం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు, కేటీఆర్ అశోక్ నగర్ వెళ్లి ఏ రోజైనా నిరుద్యోగులకు సమాధానం చెప్పారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. నాడు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుని, ఇవాళ నీతులు చెబుతున్నారని విమర్శించారు. గాంధీ కుటుంబం ఏనాడైనా మాట ఇస్తే దానికి కట్టుబడి నిలబడుతుందని, కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం మాట ఇస్తే మోసం చేయడమే అలవాటుగా మార్చుకుందని దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఏ స్థాయికైనా దిగజారే నైజం కేసీఆర్ కుటుంబానిదేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!