Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
- సరూర్నగర్ సభ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్
- సోనియా గాంధీ అంశాన్ని గుర్తుచేసిన జగ్గారెడ్డి
- గ్రూప్-1 పేపర్ లీక్పై బీఆర్ఎస్ను టార్గెట్
- గాంధీ కుటుంబం మాట నిలబెడుతుందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరూర్ నగర్ సభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కేటీఆర్ ‘డెత్ డిక్లరేషన్’ అంటూ మాట్లాడటంపై ఆయన తీవ్ర కౌంటర్ ఇచ్చారు. అసలు కేటీఆర్కు ఏమాత్రం రాజకీయ నియత్ (నిజాయితీ) ఉందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయం గాంధీ కుటుంబానిదైతే.. విలువలు లేని రాజకీయాలు కేసీఆర్ కుటుంబానివని మండిపడ్డారు.
సోనియా గాంధీ కాళ్లు మొక్కిన సంగతి మర్చిపోయారా?
ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియా గాంధీకి తన చర్మం వొలిచి చెప్పులు కుట్టిస్తానని కేసీఆర్ అన్న మాటలను జగ్గారెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కిన సంగతిని ఇప్పుడు ఎలా మర్చిపోతారని నిలదీశారు. నాడు కాళ్లు మొక్కి, ఇప్పుడేమో అదే గాంధీ కుటుంబంపై డెత్ డిక్లరేషన్ ప్రకటిస్తావా అంటూ కేటీఆర్పై మండిపడ్డారు. కేటీఆర్ రక్తంలో ఎక్కడా నిజాయితీ, కృతజ్ఞతా భావం లేవని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆ కుటుంబం నాశనాన్ని కోరుకోవడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
మాట ఇస్తే నిలబెట్టుకునేది రాహుల్ గాంధీ.. మోసం చేసేది కేసీఆర్ కుటుంబం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు, కేటీఆర్ అశోక్ నగర్ వెళ్లి ఏ రోజైనా నిరుద్యోగులకు సమాధానం చెప్పారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. నాడు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుని, ఇవాళ నీతులు చెబుతున్నారని విమర్శించారు. గాంధీ కుటుంబం ఏనాడైనా మాట ఇస్తే దానికి కట్టుబడి నిలబడుతుందని, కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం మాట ఇస్తే మోసం చేయడమే అలవాటుగా మార్చుకుందని దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఏ స్థాయికైనా దిగజారే నైజం కేసీఆర్ కుటుంబానిదేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!