Kanna Lakshmi Narayana: సీఎం జగన్కు కన్నా బహిరంగ లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ… కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తన లేఖలో డిమాండ్ చేసిన ఆయన.. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం కాపులకు కేటాయించాలని లేఖలో సీఎం జగన్ను కోరారు.. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో దీనిపై బిల్లు పాస్ చేశారని తన లేఖలో ప్రస్తావించిన కన్నా… రిజర్వేషన్ల అంశంపై 2019 జులైలో కూడా తాను లేఖ రాసినట్లు స్పష్టం చేశారు.. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. కాపులు ఆర్థికంగా వెనుకబడిన విషయాన్ని మంజునాథ కమిషన్ కూడా చెప్పిందని గుర్తుచేశారు. కాపుల రిజర్వేషన్లు కల్పించాలనేది దీర్ఘకాలిక డిమాండ్.. త్వరగా దాన్ని అమలు చేయాలని కోరుతున్నానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.
Read Also: Flex Banners: ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం వాయిదా.. కారణం ఇదే..
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
కాగా, ఈ మధ్యే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై హాట్ కామెంట్లు చేశారు కన్నా లక్ష్మీనారాయణ.. మంత్రిగా అనేక దఫాలుగా పనిచేసిన కన్నా.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇలా.. వారి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు.. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత బీజేపీలో చేరారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.. ఆ తర్వాత సోము వీర్రాజు అధ్యక్షుడిగా నియమితులు కాగా.. ఈ మధ్యే సోము వీర్రాజు పనివిధానంపై కన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు.. పార్టీని నడిపే విషయంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తమతో పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని.. ఈ భావన ఇప్పటిదాకా తన మనసులోనే ఉంది.. ఇప్పుడు బయటకు వచ్చిందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆయన బీజేపీని వీడతారనే ప్రచారం జోరుగా సాగగా.. ఇప్పుడు బీజేపీ లెటర్ ప్యాడ్పైనే సీఎం జగన్కు లేఖ రాశారు కన్నా లక్ష్మీనారాయణ.
తాజావార్తలు
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!