Flex Banners: ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం వాయిదా.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.. నవంబర్ 1వ తేదీ నుంచి నిషేధం అమలులోకి వస్తుందంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కార్.. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయితే, ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలును ప్రస్తుతానికి వాయిదా వేసింది వైఎస్ జగన్ ప్ఱభుత్వం… ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై రేపటి నుంచే నిషేధం అమల్లోకి రావాల్సిఉండగా.. జనవరికి 26వ తేదీకి వాయిదా వేసింది.. అయితే, ఇప్పుడు అంతా ఫ్లెక్సీల మయమే.. చిన్నా టీ కొట్టు బోర్డు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ , హోర్డింగ్స్ అన్నీ.. ఫ్లెక్సీ ఫ్రింటింగ్పైనే ఆధారపడి ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని మార్చుకునేందుకు, సమకూర్చుకునేందుకు తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారులు ప్రభుత్వానికి విన్నవించారు.. వారి విజ్ఞప్తిని అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.
Read also: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. అర్ధరాత్రి నుంచే టోకెన్లు జారీ
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
దీంతో.. ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇక, ఈలోగా వారికి చేదోడుగా నిలవాలని అధికారులకు సూచించిన ఆయన.. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో వారికి తగిన విధంగా తోడుగా నిలవాలని.. అలాగే సామగ్రిని మార్చుకునేందుకు అవసరం మేరకు రూ.20 లక్షల వరకు పావలా వడ్డీకే ఫ్లెక్సీ తయారీదారులకు రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.. మొత్తంగా.. నవంబర్ 1వ తేదీ నుంచి అమలు కావాల్సి ఉన్న ప్లాస్టిక్ ఫ్లెక్సీల రద్దు అమలు జనవరి 26వ తేదీకి వాయిదా పడింది.. కాగా, పర్యావరణ హితంకోసం ప్లాస్టిక్ ఫ్లెక్సీలను రద్దుచేస్తూ ఇదివరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వం.. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధించాలని.. ఉల్లంఘనులను పర్యావరణ పరిరక్షణ చట్టం కింద శిక్షించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఫ్లెక్సీలపై నిషేధం నోటిఫికేషన్ అమలు, పర్యవేక్షణను రెవెన్యూ, పోలీసు, రవాణ, జీఎస్టీ తదితర విభాగాల అధికారులు చేపట్టాలని సూచించిన విషయం విదితమే కాగా.. తాజా ఆదేశాలతో అది జనవరి 26వ తేదీకి వాయిదా పడింది.
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!