Flex Banners: ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం వాయిదా.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.. నవంబర్ 1వ తేదీ నుంచి నిషేధం అమలులోకి వస్తుందంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కార్.. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయితే, ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలును ప్రస్తుతానికి వాయిదా వేసింది వైఎస్ జగన్ ప్ఱభుత్వం… ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై రేపటి నుంచే నిషేధం అమల్లోకి రావాల్సిఉండగా.. జనవరికి 26వ తేదీకి వాయిదా వేసింది.. అయితే, ఇప్పుడు అంతా ఫ్లెక్సీల మయమే.. చిన్నా టీ కొట్టు బోర్డు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ , హోర్డింగ్స్ అన్నీ.. ఫ్లెక్సీ ఫ్రింటింగ్పైనే ఆధారపడి ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని మార్చుకునేందుకు, సమకూర్చుకునేందుకు తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారులు ప్రభుత్వానికి విన్నవించారు.. వారి విజ్ఞప్తిని అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.
Read also: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. అర్ధరాత్రి నుంచే టోకెన్లు జారీ
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
దీంతో.. ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇక, ఈలోగా వారికి చేదోడుగా నిలవాలని అధికారులకు సూచించిన ఆయన.. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో వారికి తగిన విధంగా తోడుగా నిలవాలని.. అలాగే సామగ్రిని మార్చుకునేందుకు అవసరం మేరకు రూ.20 లక్షల వరకు పావలా వడ్డీకే ఫ్లెక్సీ తయారీదారులకు రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.. మొత్తంగా.. నవంబర్ 1వ తేదీ నుంచి అమలు కావాల్సి ఉన్న ప్లాస్టిక్ ఫ్లెక్సీల రద్దు అమలు జనవరి 26వ తేదీకి వాయిదా పడింది.. కాగా, పర్యావరణ హితంకోసం ప్లాస్టిక్ ఫ్లెక్సీలను రద్దుచేస్తూ ఇదివరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వం.. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధించాలని.. ఉల్లంఘనులను పర్యావరణ పరిరక్షణ చట్టం కింద శిక్షించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఫ్లెక్సీలపై నిషేధం నోటిఫికేషన్ అమలు, పర్యవేక్షణను రెవెన్యూ, పోలీసు, రవాణ, జీఎస్టీ తదితర విభాగాల అధికారులు చేపట్టాలని సూచించిన విషయం విదితమే కాగా.. తాజా ఆదేశాలతో అది జనవరి 26వ తేదీకి వాయిదా పడింది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..