Kakani Govardhan Reddy: చంద్రబాబుకి తన కొడుకు లోకేష్ కూడా మోసం చేస్తాడనే అనుమానం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy Comments On Chandrababu Naidu: ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడపై ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. పేదలకు ఇస్తున్న సెంట్ భూమి శవాన్ని పూడ్చుకోవడానికి సరిపోతుందంటూ చంద్రబాబు అహంకారంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీల పేర్లతో రైతుల నుంచి చంద్రబాబు భూములు లాక్కున్నారని, పేదలకు సొంతింటి కల నిజం కాకుండా పలుమార్లు అడ్డుకున్నారని ఆరోపణలు చేశారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లు కట్టుకుంటే ఎందుకు బాధ? అని ప్రశ్నించారు. అమరావతి భూములను బంగారు బాతులాగా వాడుకోవాలని చూశారని అన్ననారు. అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఎందుకివ్వలేదని నిలదీశారు. ప్రస్తుతం అర్హులందరికీ ఇళ్లు ఇస్తున్నామని, పేదింటి సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్ నిజం చేస్తున్నారని అన్నారు.
Rs. 2000 Notes withdrawn: రూ.2000 నోటు రద్దు.. రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం..
Also Read
- Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
- Kanaka Durga Temple: నేడు హైదరాబాద్ నుంచి కనకదుర్గమ్మకు బంగారు బోనం.. వీఐపీ దర్శనాలు నిలిపివేత!
- OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
- Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
చంద్రబాబు మదమెక్కి మాట్లాడుతున్నారని.. ఇలాంటి వ్యక్తికి రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని కాకాణి గోవర్ధన్ ధ్వజమెత్తారు. తన కొడుకు లోకేష్ కూడా తనను మోసం చేస్తాడనే అనుమానం చంద్రబాబుకు ఉందని అభిప్రాయపడ్డారు. రైతుల ఉచిత బీమాకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. బడ్జెట్ ప్రసంగంలోనే తాము పూర్తి వివరాలు వెల్లడించామని.. బీమా కింద రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చెప్పారు. తక్కువ సనయంలోనే పంటల నష్టాన్ని అంచనా వేసి, పరిహారం ఇస్తున్నామన్నారు. దిగుబడి లేదా వాతావరణ కారణాల వల్ల పంటకు నష్టం జరిగితే.. వాటికి పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోందన్నారు. దేశంలో ఆంధ్ర రాష్ట్రమే ఈ విధానాన్ని అమలు చేస్తోందని అన్నారు. ఏదో ఒక విధంగా ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఫైరయ్యారు. రైతులు నష్టపోకుండా చూస్తున్నామన్న ఆయన.. రైతులు ఎవరూ ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
Extramarital Affair: ప్రియుడితో భర్తని చంపించిన భార్య.. లైవ్లో చూస్తూ ఎంజాయ్ చేసింది
తాజావార్తలు
-
Kargil Vijay Diwas 2026: కార్గిల్ విజయ్ దివస్.. వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ..
-
NBK111: బాలయ్య కోసం గోపీచంద్ ప్రత్యేక హోమం.. డిశ్చార్జ్పై గుడ్ న్యూస్!
-
Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
-
Akhil Akkineni: అమెరికా పౌరసత్వానికి గుడ్బై.. కీలక నిర్ణయం తీసుకున్న అఖిల్ అక్కినేని!
-
Abhijeet Dipke: “ఇది అంతం కాదు.. ఆరంభం”.. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!