Kakani Govardhan Reddy: చంద్రబాబుకి తన కొడుకు లోకేష్ కూడా మోసం చేస్తాడనే అనుమానం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy Comments On Chandrababu Naidu: ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడపై ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. పేదలకు ఇస్తున్న సెంట్ భూమి శవాన్ని పూడ్చుకోవడానికి సరిపోతుందంటూ చంద్రబాబు అహంకారంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీల పేర్లతో రైతుల నుంచి చంద్రబాబు భూములు లాక్కున్నారని, పేదలకు సొంతింటి కల నిజం కాకుండా పలుమార్లు అడ్డుకున్నారని ఆరోపణలు చేశారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లు కట్టుకుంటే ఎందుకు బాధ? అని ప్రశ్నించారు. అమరావతి భూములను బంగారు బాతులాగా వాడుకోవాలని చూశారని అన్ననారు. అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఎందుకివ్వలేదని నిలదీశారు. ప్రస్తుతం అర్హులందరికీ ఇళ్లు ఇస్తున్నామని, పేదింటి సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్ నిజం చేస్తున్నారని అన్నారు.
Rs. 2000 Notes withdrawn: రూ.2000 నోటు రద్దు.. రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం..
Also Read
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- CM Chandrababu: 'స్వర్ణ కుప్పం విజన్ 2029'కు శ్రీకారం.. కుప్పం రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్పై సీఎం సమీక్ష
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
- Kandula Durgesh: "మీ అక్రమ సంబంధం నాకు తెలుసు".. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
చంద్రబాబు మదమెక్కి మాట్లాడుతున్నారని.. ఇలాంటి వ్యక్తికి రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని కాకాణి గోవర్ధన్ ధ్వజమెత్తారు. తన కొడుకు లోకేష్ కూడా తనను మోసం చేస్తాడనే అనుమానం చంద్రబాబుకు ఉందని అభిప్రాయపడ్డారు. రైతుల ఉచిత బీమాకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. బడ్జెట్ ప్రసంగంలోనే తాము పూర్తి వివరాలు వెల్లడించామని.. బీమా కింద రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చెప్పారు. తక్కువ సనయంలోనే పంటల నష్టాన్ని అంచనా వేసి, పరిహారం ఇస్తున్నామన్నారు. దిగుబడి లేదా వాతావరణ కారణాల వల్ల పంటకు నష్టం జరిగితే.. వాటికి పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోందన్నారు. దేశంలో ఆంధ్ర రాష్ట్రమే ఈ విధానాన్ని అమలు చేస్తోందని అన్నారు. ఏదో ఒక విధంగా ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఫైరయ్యారు. రైతులు నష్టపోకుండా చూస్తున్నామన్న ఆయన.. రైతులు ఎవరూ ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
Extramarital Affair: ప్రియుడితో భర్తని చంపించిన భార్య.. లైవ్లో చూస్తూ ఎంజాయ్ చేసింది
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!