Kakani Govardhan Reddy: చంద్రబాబుకి తన కొడుకు లోకేష్ కూడా మోసం చేస్తాడనే అనుమానం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy Comments On Chandrababu Naidu: ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడపై ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. పేదలకు ఇస్తున్న సెంట్ భూమి శవాన్ని పూడ్చుకోవడానికి సరిపోతుందంటూ చంద్రబాబు అహంకారంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీల పేర్లతో రైతుల నుంచి చంద్రబాబు భూములు లాక్కున్నారని, పేదలకు సొంతింటి కల నిజం కాకుండా పలుమార్లు అడ్డుకున్నారని ఆరోపణలు చేశారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లు కట్టుకుంటే ఎందుకు బాధ? అని ప్రశ్నించారు. అమరావతి భూములను బంగారు బాతులాగా వాడుకోవాలని చూశారని అన్ననారు. అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఎందుకివ్వలేదని నిలదీశారు. ప్రస్తుతం అర్హులందరికీ ఇళ్లు ఇస్తున్నామని, పేదింటి సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్ నిజం చేస్తున్నారని అన్నారు.
Rs. 2000 Notes withdrawn: రూ.2000 నోటు రద్దు.. రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం..
Also Read
- Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
- Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన.. మరొకరి మృతి..!
- Fake Registration: ఏం తెలివిరా నాయనా.. భూమిని ఆక్రమించడానికి తహసీల్దార్, వీఆర్ఓ సంతకాల ఫోర్జరీ..
- YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
చంద్రబాబు మదమెక్కి మాట్లాడుతున్నారని.. ఇలాంటి వ్యక్తికి రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని కాకాణి గోవర్ధన్ ధ్వజమెత్తారు. తన కొడుకు లోకేష్ కూడా తనను మోసం చేస్తాడనే అనుమానం చంద్రబాబుకు ఉందని అభిప్రాయపడ్డారు. రైతుల ఉచిత బీమాకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. బడ్జెట్ ప్రసంగంలోనే తాము పూర్తి వివరాలు వెల్లడించామని.. బీమా కింద రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చెప్పారు. తక్కువ సనయంలోనే పంటల నష్టాన్ని అంచనా వేసి, పరిహారం ఇస్తున్నామన్నారు. దిగుబడి లేదా వాతావరణ కారణాల వల్ల పంటకు నష్టం జరిగితే.. వాటికి పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోందన్నారు. దేశంలో ఆంధ్ర రాష్ట్రమే ఈ విధానాన్ని అమలు చేస్తోందని అన్నారు. ఏదో ఒక విధంగా ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఫైరయ్యారు. రైతులు నష్టపోకుండా చూస్తున్నామన్న ఆయన.. రైతులు ఎవరూ ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
Extramarital Affair: ప్రియుడితో భర్తని చంపించిన భార్య.. లైవ్లో చూస్తూ ఎంజాయ్ చేసింది
తాజావార్తలు
-
Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
-
Tata Sierra EV: జూన్ 30న టాటా సియెర్రా EV లాంచ్.. 500 కి.మీ. రేంజ్తో వస్తున్న SUV
-
Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
-
Maharashtra: ఫుట్బాల్ కోచ్ దారుణం.. మూడేళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారం..
-
NBK 112 గ్రాండ్ లాంచ్ డేట్ ఇదేనా? బాలయ్య – కొరటాల మూవీ ఓపెనింగ్కు సీఎం చంద్రబాబు, లోకేష్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!