Kakani Govardhan Reddy: పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి నిష్క్రమించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రైతులకు ద్రోహం చేశారని.. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు కాటకాలు విలయతాండవం చేస్తుంటాయని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 471 మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. వీరందరికీ తమ ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిన విషయం వాస్తవమా కాదా అని నిలదీశారు. ఈ అంశంపై చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలన్నారు. రూ.5,500 కోట్లను సీఎం జగన్ ఒక్క బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తే ఎందుకు హర్షించ లేకపోతున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పంటల బీమా కింద రాష్ట్ర ప్రభుత్వం 6,680 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రైతు, రాష్ట్రం, కేంద్రం చెల్లించాల్సిన మూడు వంతులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కూడా అభినందించారని గుర్తుచేశారు. కేంద్రం వాటా భరిస్తామని స్పష్టం చేశారు.
Read Also: YSRCP: శ్రీకాంత్రెడ్డికి కేబినెట్ హోదా.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Also Read
చంద్రబాబుకు అసలు నీతి నిజాయితీ ఉందా అని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని.. డ్రిప్ ఇరిగేషన్ పేరుతో 700 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లాడని.. దీంతో అనేక కంపెనీలు మూతపడ్డాయన్నారు. ఎవరెన్ని చేసినా జగన్ తలరాతను ఎవరూ మార్చలేరన్నారు. రెండు చోట్ల పోటీ చేసినా ఓడిపోయాడు అంటే ప్రజలు తిరస్కరించారని అర్ధమని.. అయినా ప్రజల్లో తిరగడానికి పవన్ కళ్యాణ్కు సిగ్గుండాలని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తక్షణమే రాజకీయాల నుంచి నిష్క్రమించాలన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పింది మూడు ఆప్షన్లు.. కానీ అమలు చేసేది నాలుగో ఆప్షన్ అని చురకలు అంటించారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీనే నాలుగో ఆప్షన్ అన్నారు. 1800 ఎకరాల్లో నర్సరీ దెబ్బ తిందని ప్రాథమిక అంచనా అని.. వర్షాలు తగ్గితే కానీ పూర్తి స్థాయిలో అంచనా వేయలేమన్నారు. ఎప్పటిలానే పంట నష్టానికి ఈ సీజన్లోనే నష్ట పరిహారం అందజేస్తామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పర్యవేక్షణ చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!