Kakani Govardhan Reddy: పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి నిష్క్రమించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రైతులకు ద్రోహం చేశారని.. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు కాటకాలు విలయతాండవం చేస్తుంటాయని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 471 మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. వీరందరికీ తమ ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిన విషయం వాస్తవమా కాదా అని నిలదీశారు. ఈ అంశంపై చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలన్నారు. రూ.5,500 కోట్లను సీఎం జగన్ ఒక్క బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తే ఎందుకు హర్షించ లేకపోతున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పంటల బీమా కింద రాష్ట్ర ప్రభుత్వం 6,680 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రైతు, రాష్ట్రం, కేంద్రం చెల్లించాల్సిన మూడు వంతులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కూడా అభినందించారని గుర్తుచేశారు. కేంద్రం వాటా భరిస్తామని స్పష్టం చేశారు.
Read Also: YSRCP: శ్రీకాంత్రెడ్డికి కేబినెట్ హోదా.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
చంద్రబాబుకు అసలు నీతి నిజాయితీ ఉందా అని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని.. డ్రిప్ ఇరిగేషన్ పేరుతో 700 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లాడని.. దీంతో అనేక కంపెనీలు మూతపడ్డాయన్నారు. ఎవరెన్ని చేసినా జగన్ తలరాతను ఎవరూ మార్చలేరన్నారు. రెండు చోట్ల పోటీ చేసినా ఓడిపోయాడు అంటే ప్రజలు తిరస్కరించారని అర్ధమని.. అయినా ప్రజల్లో తిరగడానికి పవన్ కళ్యాణ్కు సిగ్గుండాలని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తక్షణమే రాజకీయాల నుంచి నిష్క్రమించాలన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పింది మూడు ఆప్షన్లు.. కానీ అమలు చేసేది నాలుగో ఆప్షన్ అని చురకలు అంటించారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీనే నాలుగో ఆప్షన్ అన్నారు. 1800 ఎకరాల్లో నర్సరీ దెబ్బ తిందని ప్రాథమిక అంచనా అని.. వర్షాలు తగ్గితే కానీ పూర్తి స్థాయిలో అంచనా వేయలేమన్నారు. ఎప్పటిలానే పంట నష్టానికి ఈ సీజన్లోనే నష్ట పరిహారం అందజేస్తామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పర్యవేక్షణ చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!