Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Seed Access Road: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అనుసంధానించే కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉండవల్లి వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల నిర్మాణానికి సూచికగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్తో పాటు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాయపూడి నుంచి ఉండవల్లి వరకు రహదారి
సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా రాయపూడి నుంచి వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి వరకు పనులు పూర్తయ్యాయి. రాజధాని ప్రాంతంలోని పలు ముఖ్య ప్రాంతాలను అనుసంధానించే ఈ రహదారి అందుబాటులోకి రావడంతో ప్రజలకు, వాహనదారులకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ఇక, అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని మొత్తం రూ.1,519 కోట్ల వ్యయంతో చేపట్టారు. రాజధాని ప్రాంతంలో మెరుగైన రహదారి కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తవడంతో రాజధాని నగరానికి మరింత మెరుగైన అనుసంధానం ఏర్పడనుంది.
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
జాతీయ రహదారి-16కు అనుసంధానం
సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని దశలవారీగా విస్తరించే ప్రణాళిక ఉంది. మూడో దశలో మణిపాల్ వద్ద జాతీయ రహదారి-16కు అనుసంధానించేలా రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. దీంతో అమరావతికి జాతీయ రహదారి నెట్వర్క్తో మరింత మెరుగైన కనెక్టివిటీ ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు.. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ బ్రిడ్జిలను కాలినడకన పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారి, బ్రిడ్జి నిర్మాణంతో రాజధాని ప్రాంతంలో వాహన రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
ఇక పూర్తి స్థాయిలో వాహన రాకపోకలు
సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో నేటి నుంచి ఈ మార్గంలో పూర్తి స్థాయిలో వాహన రాకపోకలకు మార్గం సుగమమైంది. రాజధాని ప్రాంతానికి వచ్చే ప్రజలు, స్థానికులు, వాహనదారులకు ఈ రహదారి కీలకంగా మారనుంది. ప్రారంభ కార్యక్రమానికి రైతులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తాజావార్తలు
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్కు చిరంజీవి మెగా బర్త్డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్కు అదిరిపోయే ఓపెనింగ్స్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!