Janasena Party: జనవాణి కార్యక్రమానికి భారీ స్పందన.. అర్జీలు స్వీకరించిన పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమాన్ని జనసేన పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా అర్జీలను స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా తాము కృషి చేస్తామని పవన్ స్పష్టం చేశారు.
Read Also: Andhra Pradesh: రేపు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న సీఎం జగన్
Also Read
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
- Kandula Durgesh: "మీ అక్రమ సంబంధం నాకు తెలుసు".. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
- AP Weather Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలు అప్రమత్తం!
అటు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే సమాజంలో సమస్యలు తెలుస్తాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజల ఆవేదన నుంచే పరిష్కారాలు పుట్టుకొస్తాయన్నారు. నేతలు అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారం చేస్తామంటే కుదరదని పవన్ అన్నారు. తమకు పదవి లేకపోయినా సమాజంలో ఇబ్బందులపై దృష్టి సారించి పరిష్కరిస్తామని పవన్ పేర్కొన్నారు. దళిత, ఆదివాసీలు ఈ పాలకులకు ఓటు బ్యాంకు మాత్రమే అని.. సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై అధ్యయనం చేస్తామని పవన్ తెలిపారు. దళిత, ఆదివాసీలను పాలకులు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని పవన్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో 29 పథకాలు రద్దు చేసిందని.. దేశం మొత్తం అమల్లో ఉన్న సబ్ ప్లాన్ నిధుల్ని ఇతర అవసరాలకు ఎలా వాడుకుంటారని ప్రశ్నించారు. దళిత ఆదివాసీల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని పవన్ హామీ ఇచ్చారు. కాగా జనసేన జనవాణి కార్యక్రమానికి అర్జీలు సమర్పించేందుకు ప్రజలు భారీ ఎత్తున విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియానికి తరలి వచ్చారు.
"జనవాణి – జనసేన భరోసా" కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుండి విశేష స్పందన.#JanaVaaniJanaSenaBharosa
Full Album Link: https://t.co/gai1vHW7HF pic.twitter.com/sLUH60M6Th
— JanaSena Party (@JanaSenaParty) July 3, 2022
తాజావార్తలు
-
Nagabandham: ‘నాగబంధం’ మేకర్స్ ఊహించని నిర్ణయం!
-
Ketan Agarwal Case: ‘పురుషులకు రక్షణ లేదు’.. జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ మిట్టల్
-
CM Revanth Reddy : మిడ్జిల్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం.. నాడు మీరు నాటిన మొక్కే.. నేడు సీఎంగా..
-
Tata Motors: మారుతిని వెనక్కి నెట్టిన టాటా పంచ్.. జూన్లో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే!
-
Sachin Tendulkar: టీ20ల్లో వైభవ్ సరికొత్త చరిత్ర.. కానీ సచిన్కి చెందిన ఈ రికార్డులను తాకడం అంత ఈజీ కాదు!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..