Manyam district : మన్యం జిల్లాలో దారుణం.. షార్ట్ ఫిల్మ్ మోజులో ఆత్మహత్య చేసుకున్న యువకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manyam district: సినీ రంగం పైన ఆసక్తి ఉండడం తప్పు కాదు. కానీ ఇష్టం ఉన్న పనిని ప్రారంభించాలి ఒక్కసారిగా నేమ్ ఫేమ్ సంపాదించాలి అనుకుని ఓ ప్లాన్ లేకుండా అప్పులు చేస్తేనే ముప్పు. ఇలా సినీ రంగం పైన అవగాహనా లేకుండా అప్పులు తెచ్చి సినిమాలు తీసి నష్టపోయిన వాళ్ళు గతంలో కోకొల్లలు. అయితే ఇప్పుడు ఆకోవలోకి షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు కూడా వస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ పైన ఓ యువకుడికి ఉన్న ఆసక్తి అతని ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మన్యం జిల్లా లోని పార్వతీపురం లోని మణికంఠ కాలనీకి చెందిన దుప్పలపూడి సునీల్ అనే యువకుడు సినిమాలపైన ఉన్న ఇష్టంతో.. షార్ట్ ఫిలిమ్స్ తీస్తే ఏదో రోజు సినిమా అవకాశం వస్తుందనే ఆశతో.. సొంత బంధువులు, స్నేహితులు దగ్గర అప్పులు చేసి షార్ట్ ఫిల్మ్ లు తీసాడు.
Read also:Supreme Court: రాజ్యసభ ఛైర్మన్కి క్షమాపణలు చెప్పండి.. ఆప్ ఎంపీకి సుప్రీంకోర్టు సూచన
Also Read
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
అయితే ఆ షార్ట్ ఫిలిమ్స్ నుండి తనకు లాభం రాకపోగా నష్టాల పాలయ్యాడు. యువకుడి తల్లి సరస్వతీ మెప్మాలో ఆర్పీగా పనిచేస్తున్నారు. కాగా ఆమె జీతం డబ్బులు కూడా షార్ట్ ఫిలిమ్స్ తీసేందుకు వినియోగించాడు. ఈ క్రమంలో ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నాడు సునీల్. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్న సునీల్ ఆర్ధిక ఇబ్బందులు పెరగడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందిన కొడుకు మరణంతో సునీల్ తల్లి గుండెలవిసేలా విలపిస్తోంది. కాగా సునీల్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సునీల్ మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం కేంద్ర ఆసుపత్రికి తరలించారు
తాజావార్తలు
-
Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!