YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: తాజా రాజకీయ పరిణాలు, రాష్ట్రంలోని పరిస్థితులు.. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిసారించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కీలక సమావేశానికి సిద్ధం అయ్యారు.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగా ఇవాళ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి, సాగునీరు, తాగునీటి సమస్యలపై జిల్లాల వారీగా సమీక్షించే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నీటి లభ్యత వంటి అంశాలపై జిల్లా అధ్యక్షుల నుంచి జగన్ వివరాలు తెలుసుకోనున్నారు.
అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఎన్నికలకు పార్టీ శ్రేణులను ఎలా సిద్ధం చేయాలి, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను ఎలా బలోపేతం చేయాలనే అంశాలపై జిల్లా అధ్యక్షులతో జగన్ చర్చించనున్నారు. పార్టీ బలోపేతం, జిల్లాల వారీగా సంస్థాగత పరిస్థితులు, నాయకులు-కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపైనా వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా నేతలతో చర్చించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!