Heavy Rush: రద్దీగా మారిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
- సంక్రాంతికి పల్లెబాట పట్టిన నగర వాసులు..
- హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు బయల్దేరిన జనం..
- ప్రయాణికులతో రద్దీగా మారిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rush: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ప్రయాణికుల రద్దీతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు నిండిపోయాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పండగ నేపథ్యంలో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇసకేస్తే రాలని జనం ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 188 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయగా.. పండగ సందర్భంగా అదనంగా 33 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది దక్షిణ మధ్య రైల్వే. అలాగే, సంక్రాంతి పండగ ప్రయాణాలతో పాటు శబరి, కుంభమేళాకు వెళ్లే వారు కూడా ఉండటంతో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
Read Also: Sankranti Effect: సంక్రాంతికి పల్లెబాట పట్టిన ప్రజలు.. టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్!
Also Read
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు, రైళ్లను నడపాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు. ఇక, హైదరాబాద్, విజయవాడ రైల్వేస్టేషన్లలోనూ ఇదే పరిస్ధితి కొనసాగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తోన్న ట్రైన్స్ అన్నీ ఎప్పుడో నిండిపోగా ఇప్పుడు ఊరెళ్లే వారికి ప్రత్యేక రైళ్లపైనే ఆధారపడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను నడిపిస్తు్న్న కూడా ట్రైన్స్ లేవని అంటున్నారు.ప్రత్యేక రైళ్లు, జనరల్ బోగీలు పెంచాలని అధికారులను ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, నర్సీపట్నం, కాకినాడ, అమలాపురం, భీమవరానికి అదనపు బస్సు సర్వీసులు కేటాయించామని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!