Montana Pileup: ధూళి తుపాను కారణంగా 21 వాహనాలు ఢీ.. ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Montana Pileup: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ధూళి తుపాను కారణంగా హార్డిన్ సమీపంలోని మోంటానాలోని ఇంటర్స్టేట్ 90 ప్రాంతంలో 21 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలు వాహనాలు దెబ్బతిన్నాయి.ప్రమాద సమయంలో గంటకు 64 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు.పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగి రోడ్డు కనిపించక పోవడం వల్ల వాహనాలు ఢీకొన్నట్లు పేర్కొన్నారు. వాహనాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో మోంటానా ఎక్స్ప్రెస్ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ఫలితంగా.. కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపై నిలిపోయాయి. గాయపడిన వారి గురించి ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు.
ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల సృష్టికర్తలెవరో తెలుసా..?
Also Read
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
- China: జిన్పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక 'అసలు' మిస్టరీ ఇదేనా!
- Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
హార్డిన్ సమీపంలో జరిగిన ప్రమాదం గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని గవర్నర్ జియాన్ఫోర్ట్ ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులకు, స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు. హార్డిన్కు పశ్చిమాన 40 మైళ్ల దూరంలో మెరుపులతో కూడిన గాలివానలు పడ్డాయని వాతావరణ శాస్త్రవేత్త టాడ్ ఛాంబర్స్ తెలిపారు.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!