Godavari Floods: పోలవరం ముంపు మండలాలు అతలాకుతలం..! ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర క్రమంగా వరద ఉధృతి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.. దీంతో.. దిగువ ప్రాంతంలో ప్రజలు అల్లాడిపోతున్నారు.. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితి దయనీయంగా తయారింది.. గోదావరి ఉగ్రరూపంతో అతలాకుతలం అవుతున్నాయి పోలవరం ముంపు మండలాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు ప్రజలు.. ఇప్పటికే అనేక గ్రామాలు జల దిగ్బంధంలోకి వెళ్లిపోగా.. మరోవైపు గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.. వేలేరుపాడు మండల కేంద్రం సహా 30 గ్రామాలను ఇప్పటికే వరదనీరు చుట్టుముట్టింది..
Read Also: CM YS Jagan: గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సీఎం.. 2,61,516 మందికి లబ్ధి
Also Read
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
మరోవైపు, రేపకాగోమ్ము, కోయిదా, కట్కూరు, కన్నాయిగూడెం, వేలేరుపాడు, నల్లారం, జగన్నాథపురం వంటి పలు గ్రామాలు ఇప్పటికే నీటమునిగాయి.. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 70 అడుగులకు చేరితే కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు జల సమాధి అవుతాయనే ఆందోళనతో ప్రజలు వణికిపోతున్నారు.. లంక గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుతుండడంతో.. ఏటి గట్ల మీద బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ప్రజలు.. అధికారులు బియ్యం ఇచ్చి వెళ్లారని, ఎక్కడ వండుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పిల్లలకు పాలు కూడా దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు.. ఇక, పునరావాస కేంద్రాల్లో భోజన సౌకర్యం కూడా లేదని.. అక్కడికొచ్చి ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు లంక గ్రామాల ప్రజలు.. గోదావరి ఉధృతి మరింత పెరిగితే అల్లకల్లోలంగా లంక గ్రామాల్లో పరిస్థితి మారుతుందనే ఆందోళన మాత్రం వెంటాడుతూనే ఉంది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!