Nara Lokesh: లోకేష్ పాదయాత్రలో అపశృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.. లోకేష్ పాదయాత్ర బందోబస్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో రమేష్ కుప్పకూలాడు.. వెంటనే అప్రమత్తమైన సహచర పోలీసులు.. అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, రమేష్.. ఐరాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేసేవారు. పాదయాత్ర కాన్వాయ్ నిర్వహణలో ఉండగా గుండెపోటు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. కాగా, కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర 14వ రోజుకు చేరింది..
జీడి నెల్లూరు నియోజకావర్గం, రంగాపురం క్రాస్ వద్ద లోకేష్ మాట్లాడుతూ.. పరదాలు లేకుండా బయటకి రాలేని జగన్, నా పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు.. జగన్ సహకరిస్తే పాదయాత్ర, సహకరించకపోతే దండయాత్ర చేస్తానని ప్రకటించారు.. లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి వందల మంది పోలీసులా? అని ప్రశ్నించారు. ఒక పోలీసు అధికారి రఘురామిరెడ్డి అత్యుత్సాహం చూపిస్తున్నాడు, అధికారంలోకి వచ్చేది మేమే, అప్పుడు చూపిస్తాం అని హెచ్చరించారు.. 2024లో ఐపీఎస్ అధికారులు జైలుకు వెళ్లి కార్యక్రమాలు ఉండబోతున్నాయని వార్నింగ్ ఇచ్చారు.. ఏ పోలీసులు అయితే రాజారెడ్డి రాజ్యాంగ అమలు చేస్తున్నారో వారు జైలుకే.. నా పైన 19 కేసులు పెట్టారు, ఎన్నైనా పెట్టుకో నేను భయపడనన్న లోకేష్.. ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆరోపించారు.. ఎన్నికల ముందు పెంచుకుంటు పోతాను అంటే ఏమో అనుకున్నాము, కానీ నిత్యావసర వస్తువులు, మద్యం, కరెంట్ బిల్, పన్నులు పెంచుకుంటూ పోతున్నారని.. మనం పీల్చే గాలికి పన్ను వేస్తారేమో? అని ఎద్దేవా చేశారు నారా లోకేష్.
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
మరోవైపు.. లోకేష్ పాదయాత్ర పై మంత్రి వేణు సైటర్లు వేశారు.. లోకేష్ దొడ్డి దారిన మంత్రి అయ్యాడని విమర్శలు గుప్పించిన ఆయన.. చంద్రబాబు సభలో ఏడుగురి చావు కి కారణం అయ్యాడు.. ఇప్పుడు లోకేష్ కానిస్టేబుల్ ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అసలు రాష్ట్రంలో ఏమి లోటు ఉందని లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు అంటూ నిలదీశారు మంత్రి వేణు..
తాజావార్తలు
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
-
Mark Zuckerberg: జుకర్బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
-
US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..