Nara Lokesh: లోకేష్ పాదయాత్రలో అపశృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.. లోకేష్ పాదయాత్ర బందోబస్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో రమేష్ కుప్పకూలాడు.. వెంటనే అప్రమత్తమైన సహచర పోలీసులు.. అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, రమేష్.. ఐరాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేసేవారు. పాదయాత్ర కాన్వాయ్ నిర్వహణలో ఉండగా గుండెపోటు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. కాగా, కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర 14వ రోజుకు చేరింది..
జీడి నెల్లూరు నియోజకావర్గం, రంగాపురం క్రాస్ వద్ద లోకేష్ మాట్లాడుతూ.. పరదాలు లేకుండా బయటకి రాలేని జగన్, నా పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు.. జగన్ సహకరిస్తే పాదయాత్ర, సహకరించకపోతే దండయాత్ర చేస్తానని ప్రకటించారు.. లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి వందల మంది పోలీసులా? అని ప్రశ్నించారు. ఒక పోలీసు అధికారి రఘురామిరెడ్డి అత్యుత్సాహం చూపిస్తున్నాడు, అధికారంలోకి వచ్చేది మేమే, అప్పుడు చూపిస్తాం అని హెచ్చరించారు.. 2024లో ఐపీఎస్ అధికారులు జైలుకు వెళ్లి కార్యక్రమాలు ఉండబోతున్నాయని వార్నింగ్ ఇచ్చారు.. ఏ పోలీసులు అయితే రాజారెడ్డి రాజ్యాంగ అమలు చేస్తున్నారో వారు జైలుకే.. నా పైన 19 కేసులు పెట్టారు, ఎన్నైనా పెట్టుకో నేను భయపడనన్న లోకేష్.. ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆరోపించారు.. ఎన్నికల ముందు పెంచుకుంటు పోతాను అంటే ఏమో అనుకున్నాము, కానీ నిత్యావసర వస్తువులు, మద్యం, కరెంట్ బిల్, పన్నులు పెంచుకుంటూ పోతున్నారని.. మనం పీల్చే గాలికి పన్ను వేస్తారేమో? అని ఎద్దేవా చేశారు నారా లోకేష్.
Also Read
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
మరోవైపు.. లోకేష్ పాదయాత్ర పై మంత్రి వేణు సైటర్లు వేశారు.. లోకేష్ దొడ్డి దారిన మంత్రి అయ్యాడని విమర్శలు గుప్పించిన ఆయన.. చంద్రబాబు సభలో ఏడుగురి చావు కి కారణం అయ్యాడు.. ఇప్పుడు లోకేష్ కానిస్టేబుల్ ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అసలు రాష్ట్రంలో ఏమి లోటు ఉందని లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు అంటూ నిలదీశారు మంత్రి వేణు..
తాజావార్తలు
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!