Ambati Rambabu: గతేడాది చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ.. విభజన సమస్యల పరిష్కారంపై కమిటీ ఎక్కడ..?
- గతేడాది చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు..
- విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తామన్నారు..
- పోలవరం- బనకచర్లకు మేం వ్యతిరేకం కాదు.. దీన్ని ఆలోచన చేసింది జగనే: అంబటి రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ఢిల్లీలో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని చెప్పారు.. కొన్ని నిర్ణయాలు వస్తాయని అందరూ ఎదురు చూశారు.. ఈ సమావేశంలో అసలు ఏ ధమైన చర్చ జరగలేదు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సీఎంల సమావేశంలో బనకచర్లపై అసలు ప్రస్తావనే లేదు.. వాళ్ళ పత్రికల్లోనే ఏపీలో ఒక రకంగా, తెలంగాణలో మరో రకంగా వచ్చింది.. చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడి బయటకు వచ్చాక ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కార్యాచరణకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు.. వాళ్ళ మాటలు వింటుంటే సీఎం చంద్రబాబు మోసపు మాటలు చెబుతున్నారు అనకతప్పదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది 7- 7- 24న ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.. విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అయ్యామన్నారు.. త్వరలో కమిటీ వేసి తేల్చేస్తామన్నారు.. ఇప్పటికి ఏడాది దాటింది.. మీరు సాధించింది ఏంటి అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
ఇక, నీళ్లను రాయలసీమకు తీసుకెళ్లి సస్యశ్యామల చేద్దామన్న ఆలోచన చంద్రబాబు లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులు తప్ప మీరు చేసిందేమీ లేదు.. పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకు వెళ్లాంటే 42 లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది.. ఇవాళ దాన్ని 41.15 కే చంద్రబాబు అంగీకరించారు.. ఇప్పుడు పోలవరం, బనకచర్లకి 42 నుంచి నీళ్లు ఎలా తీసుకువెళతారు అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2027 వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.. అక్కడ పనులు మాత్రం ముందుకు వెళ్ళడం లేదు.. డయాఫ్రమ్ వాల్ చాలా ప్రధానమైంది.. 0.65 వెడల్పుతో వేయాల్సిన డయాఫ్రమ్ వాల్ 0.9 వెడల్పు లో వేస్తున్నారు.. ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రవర్తన సరినది కాదు.. ఆయనకు పోలవరం మీద అసలు ఇంట్రెస్ట్ లేదు.. ఆయన దృష్టి మొత్తం మొబలైజేషన్ ఫండ్ మీదే ఉందని మాజీ మంత్రి రాంబాబు ఆరోపించారు.
తాజావార్తలు
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..