Ambati Rambabu: గతేడాది చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ.. విభజన సమస్యల పరిష్కారంపై కమిటీ ఎక్కడ..?
- గతేడాది చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు..
- విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తామన్నారు..
- పోలవరం- బనకచర్లకు మేం వ్యతిరేకం కాదు.. దీన్ని ఆలోచన చేసింది జగనే: అంబటి రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ఢిల్లీలో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని చెప్పారు.. కొన్ని నిర్ణయాలు వస్తాయని అందరూ ఎదురు చూశారు.. ఈ సమావేశంలో అసలు ఏ ధమైన చర్చ జరగలేదు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సీఎంల సమావేశంలో బనకచర్లపై అసలు ప్రస్తావనే లేదు.. వాళ్ళ పత్రికల్లోనే ఏపీలో ఒక రకంగా, తెలంగాణలో మరో రకంగా వచ్చింది.. చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడి బయటకు వచ్చాక ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కార్యాచరణకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు.. వాళ్ళ మాటలు వింటుంటే సీఎం చంద్రబాబు మోసపు మాటలు చెబుతున్నారు అనకతప్పదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది 7- 7- 24న ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.. విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అయ్యామన్నారు.. త్వరలో కమిటీ వేసి తేల్చేస్తామన్నారు.. ఇప్పటికి ఏడాది దాటింది.. మీరు సాధించింది ఏంటి అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
Also Read
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
ఇక, నీళ్లను రాయలసీమకు తీసుకెళ్లి సస్యశ్యామల చేద్దామన్న ఆలోచన చంద్రబాబు లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులు తప్ప మీరు చేసిందేమీ లేదు.. పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకు వెళ్లాంటే 42 లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది.. ఇవాళ దాన్ని 41.15 కే చంద్రబాబు అంగీకరించారు.. ఇప్పుడు పోలవరం, బనకచర్లకి 42 నుంచి నీళ్లు ఎలా తీసుకువెళతారు అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2027 వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.. అక్కడ పనులు మాత్రం ముందుకు వెళ్ళడం లేదు.. డయాఫ్రమ్ వాల్ చాలా ప్రధానమైంది.. 0.65 వెడల్పుతో వేయాల్సిన డయాఫ్రమ్ వాల్ 0.9 వెడల్పు లో వేస్తున్నారు.. ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రవర్తన సరినది కాదు.. ఆయనకు పోలవరం మీద అసలు ఇంట్రెస్ట్ లేదు.. ఆయన దృష్టి మొత్తం మొబలైజేషన్ ఫండ్ మీదే ఉందని మాజీ మంత్రి రాంబాబు ఆరోపించారు.
తాజావార్తలు
-
Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
-
Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
-
IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
-
Rohit-Kohli: ఏంటి తమాషానా.. అభిమానులు ఊరుకుంటారా.. స్టేడియం పైకప్పే లేచిపోతుంది!
-
CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!