Ambati Rambabu: దొంగతనం చేశానని తెలిసే చంద్రబాబు భయపడుతున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చారు.. అవంటే ఎందుకు అంత భయమని అన్నారు. దొంగ తనం చేశానని తెలిసే చంద్రబాబు భయపడుతున్నాడని మంత్రి ఆరోపించారు. నోటీసులు ఇచ్చిన అధికారులను చంద్రబాబు ఎదురు ప్రశ్నిస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ముడుపులు తీసుకున్న మాట నిజం అని అధికారులు నిర్ధారించుకున్న తర్వాత అధికారులు నోటీసులు ఇచ్చి ఉంటారని అంబటి పేర్కొన్నారు.
Read Also: Vishal: అర్ధరాత్రి నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఆ నిర్మాతలు డబ్బులు గుంజారు..
Also Read
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
మరోవైపు చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ఆయనే చెప్పుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు.. చంద్రబాబు ఏమన్నా పెద్ద మగాడా అరెస్ట్ చేయకుండా ఉండడానికి అని విమర్శలు గుప్పించారు. తప్పు చేసిన వారు దుబాయ్ వెళ్లినా, అమెరికా వెళ్లినా అరెస్ట్ తప్పదన్నారు. పోలీసుల మీద రాళ్లు వేసి దాడులు చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి తెలిపారు.
Read Also: G20 Summit 2023 LIVE UPDATES: జీ20 సదస్సు.. ఢిల్లీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు
ఆంధ్ర రైతులు నీటి ఎద్దడి పరిస్థితిలో ఉన్నారని అంబటి అన్నారు. 122 ఏళ్లలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదని.. దీనికి కారణం చంద్రబాబు అని ప్రజలు అనుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టుల వద్ద చంద్రబాబు ముదనష్టపు కాలు పెట్టడం వల్లే నీటి ప్రాజెక్ట్ లు ఎండి పోతున్నాయని అనుకుంటున్నారని విమర్శించారు. నిజం ఏంటో ప్రజలే నిర్ణయిస్తారని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరు తడి పంటల పై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వర్షాలు లేవన్నారు. సాగర్ పరిధిలో పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని అంబటి రాంబాబు తెలిపారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!