Yasin Malik: యాసిన్ మాలిక్ ఉరిశిక్ష కోసం ఎన్ఐఏ అభ్యర్థన.. నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yasin Malik: టెర్రర్ ఫండిగ్ కేసులో కాశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ కు మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో యాసిన్ మాలిక్ కు జీవితఖైదు పడింది. ఇదిలా ఉంటే ఢిల్లీ హైకోర్టు సోమవారం యాసిన్ మాలిక్ కు నోటీసు జారీ చేసింది. న్యాయమూర్తులు సిద్ధార్థ్ మృదుల్ మరియు తల్వంత్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 9న మాలిక్ను తమ ముందు హాజరుపరచాలని వారెంట్లు జారీ చేసింది.
Read Also: Delhi Incident: ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక హత్య.. యూపీలో పట్టుబడిన నిందితుడు..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
నిందితుడు ఉగ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎన్ఐఏ తరుపున వాదనలు వినిపించిన సోలిసిటర జనరల్ తుషార్ మోహతా కోర్టుకు విన్నవించారు. ఈ విషయాన్ని ‘‘ అత్యంత అరుదైన’’ కేసుగా పరిగణించాలని కోర్టును కోరారు. ఈ కేసులో ఆయనకు మరణశిక్ష విధించాలని కోరారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న యాసిన్ మాలిక్, మరణశిక్షకు ప్రత్యామ్నాయమైన సెక్షన్ 121 ఐపీసీ కింద నేరాన్ని అంగీకరించారు.. కాబట్టి అతనికి నోటీసులు జారీ చేస్తున్నామని, జైలు సూపరింటెండెంట్ ద్వారా నోటీసులు అందించాలని కోర్టు ఆదేశించింది.
మే 24, 2022న ఎన్ఐఏ కోర్టు జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్ చట్టవిరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం(UAPA) కింద, ఇతర ఐపీసీ సెక్షన్ చట్టాల యావజ్జవ శిక్ష విధించింది. యూఏపీఏలో ఉన్న అన్ని నేరాలను యాసిన్ మాలిక్ అంగీకరించాడు. దీంతో అతనికి యావజ్జీవం విధించబడింది. అయితే ఈ శిక్షను ఉరిశిక్షగా పెంచాలని హైకోర్టులో ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. భయంకరమైన ఉగ్రవాదులు నేరాన్ని అంగీకరించిన తర్వాత కూడా ఉరిశిక్ష విధించకుంటే శిక్ష విధానం పూర్తిగా క్షీణిస్తుందని, ఉగ్రవాదులకు మరణశిక్షే నివారణ మార్గం అని తెలిపింది. దేశం, సైనిక కుటుంబాలు ప్రాణాలు కోల్పోయేలా చేసిన నేరాలకు జీవితఖైదు సరిపోదని, యాసిన్ మాలిక్ నేరాలను అత్యంత అరుదైన కేసు కింద చూడాలని కోర్టు హైకోర్టును కోరింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!