Gorantla Madhav: టీడీపీ నేతలకు సవాల్.. చంద్రబాబు వీడియోను అమెరికా ల్యాబ్లో టెస్ట్ చేయించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Madhav Challenge to Tdp Leaders: తన వీడియో వ్యవహారం తర్వాత వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తొలిసారిగా అనంతపురం వస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద కురువ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బళ్ళారి చౌరస్తా వద్ద ఆలయంలో గోరంట్ల మాధవ్ ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అనంతపురం బయలుదేరి వెళ్తుండగా ఆయన మాట్లాడుతూ.. తన వీడియో ఒరిజినల్ అని అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని టీడీపీ నేతలు చెప్పడం వింతగా ఉందన్నారు. తన వీడియో ఫేక్ అని పోలీసులు నిర్ధారించారని.. అయినా టీడీపీ దుష్ప్రచారం చేయడం తగదని సూచించారు. టీడీపీ నేతలే ఖాకీ డ్రెస్ వేసుకున్న పోలీసుల్లా, జడ్జిల్లా, సైంటిస్టుల్లా, ఇతర అధికారుల్లా తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తన వీడియోపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. పోలీస్ వ్యవస్థ తన కోసం సృష్టించింది కాదనే సంగతి టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని గోరంట్ల మాధవ్ సూచించారు. పోలీసులను స్వతంత్రంగా దర్యాప్తు చేయనివ్వాలని హితవు పలికారు. బ్రిటీష్ కాలం నుంచి పోలీస్ వ్యవస్థ ఉందనే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు.
Read Also: Shocking Video: పాముపై కాలేసిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే..?
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
ఒరిజినల్ వీడియో తన దగ్గర ఉందని.. పోలీసులు అడిగితే తన ఫోన్ ఇస్తానని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వీడియోను స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తే తాను కూడా తన వీడియోను దర్యాప్తు చేయించేందుకు సిద్ధమన్నారు. అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో చంద్రబాబు ఓటుకు నోటు వీడియో పరీక్ష చేయించి తప్పుడు వీడియో అని నిరూపించగలరా అని టీడీపీ నేతలకు గోరంట్ల మాధవ్ సవాల్ విసిరారు. చంద్రబాబు వీడియోను అమెరికా ల్యాబ్లో టెస్ట్ చేయించగలరా అని ప్రశ్నించారు. బీసీలపై కత్తిపెట్టి అణగదొక్కుతున్నారని. .అందుకే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. తనను గెలిపించిన ప్రజలలో తనను అప్రతిష్ట పాలు చేసేందుకు, చులకన చేసేందుకు ప్రయత్నించాలని చూస్తే ప్రతి చర్య తప్పదని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!