Guntur: ఇలా చంపుతున్నారేంట్రా.. తెనాలిలో వ్యక్తి దారుణ హత్య..
- తెనాలిలో వ్యక్తి దారుణ హత్య
- డొంక రోడ్డులో పండ్ల వ్యాపారం చేసే రబ్బాని పై గౌస్ అనే వ్యక్తి కత్తితో దాడి
- హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో వరుస హత్యలు వణికించాయి. అందరు చూస్తుండగానే కత్తులతో దాడి చేసి ప్రాణాలు బలిగొన్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమేష్(25) అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జరిగి కొన్ని గంటలైనా గడువక ముందే ఏపీలో మరో దారుణం వెలుగుచూసింది. తెనాలిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డొంక రోడ్డులో పండ్ల వ్యాపారం చేసే రబ్బాని పై గౌస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన రబ్బానిని తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రబ్బాని మృతి చెందాడు.
Also Read:Ileana D’Cruz: రూమర్స్పై స్పందించిన ఇలియానా.. అది నిజమే అని స్పష్టం..
Also Read
- Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. వైఎస్ జగన్ సవాల్..
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
- YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
అయితే రబ్బాని హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తెనాలి చినరావూరుకు చెందిన షేక్ రబ్బాని చెంచుపేట డొంక రోడ్డు వద్ద పండ్లు విక్రయిస్తుంటాడు. ఇతని మేనకోడలు కరీమాను పినపాడుకు చెందిన షేక్ గౌస్ బాజీ అలియాస్ బడే కి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఈ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాదు నుంచి కొంత మందిని తీసుకువచ్చిన గౌస్ బాజీ భార్యను కాపురానికి పంపించమని వారితో మాట్లాడించే ప్రయత్నం చేశాడు.
Also Read:Delhi: ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటపై ఉన్నత స్థాయి కమిటీ..
ఈ క్రమంలో రబ్బాని జోక్యం చేసుకోగా అతనిపై కక్ష పెంచుకున్నాడు గౌస్. రబ్బానీని అంతమొందించాలని నిర్ణయించుకుని ఆదివారం సాయంత్రం ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న రబ్బానీపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. స్థానికులు అతన్ని తెనాలి లోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే రబ్బాని మృతి చెందాడు. తెనాలి త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పట్టపగలే నడిరోడ్డుపై కత్తితో దాడి చేసి వ్యక్తిని హత్య చేయడం తెనాలిలో తీవ్ర కలకలం రేకెత్తించింది. తెలుగు రాష్ట్రాల్లో వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. మనుషులమన్న సంగతి మరిచి ఇలా చంపుతున్నారేంట్రా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..