Mahanadu 2022: మహానాడులో నాలుగు తీర్మానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశం జిల్లాలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది. మహానాడులో వివిధ అంశాలపై తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు నేతలు. ఇప్పటి వరకు నాలుగు తీర్మానాలను మహానాడులో ప్రవేశపెట్టారు నేతలు. కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు, బాదుడే బాదుడు, సంక్షేమ పథకాల్లో మోసం, కష్టాల కడలిలో సేద్యం అంశాలపై తీర్మానాలకు మహానాడు ఆమోదం తెలిపింది.
కష్టాలల కడలిలో సేద్యం.. దగాపడుతున్న రైతన్న అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ధూళిపాళ నరేంద్ర. వైసీపీ పాలనలో రాష్ట్ర రైతాంగ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర. 45 లక్షల ఎకరాల పంటల సాగు ఉంటే కేవలం 15 లక్షల ఎకరాలకే ఇన్స్యూరెన్స్ ఇచ్చారు. పెట్రో ధరల భారం కారణంగా రైతుల పైనా తీవ్ర భారం పడుతుంది. మోటార్లకు మీటర్లు పెడితే రైతులకు లాభమని మంత్రులు వింత వాదన చేస్తున్నారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
తెలంగాణ రైతులకు మీటర్ల పెట్టబోమని స్పష్టంగా చెపితే.. జగన్ మీటర్లు పెట్టి ఉరితాళ్లు వేస్తున్నాడు. టీడీపీ హయాంలో రైతులకు ఉన్న పథకాలు అన్నీ ఆగిపోయాయి. రాయల సీమలో ఉండే డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా ఆపేశారు. ఒక్క రూపాయి రైతులకు డ్రిప్ సబ్సిడీ కింద ఇవ్వలేదు. ప్రభుత్వం చెప్పిన రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ ఏమయ్యింది..? ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఉంటే రూ. 1000-1100కు ధాన్యం ఎందుకు అమ్ముకుంటారు..? స్వయంగా వైసీపీ ఎంపీనే ధాన్యం రైతులకు జరుగుతున్న అన్యాయంపై చెప్పింది వాస్తవం కాదా..?
రైతుకు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన దానికంటే ఒక్క రూపాయి కూడా అదనంగా వైసీపీ ఖర్చు చేయలేదన్నారు నరేంద్ర. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యంపై తీర్మానం ప్రవేశపెట్టారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. దళిత నియోజకవర్గంలో ఉన్న అమరావతిపై కుల ముద్ర వేశారు. అమరావతి నిర్మాణం ఆపేస్తే రాష్ట్రానికి.. దళిత, బడుగులకు నష్టం. ఆరు దళిత నియోజకవర్గావ మధ్యలో అమరావతి ఉందనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. అత్యంత కీలక ప్రాజెక్టులైన అమరావతి-పోలవరం పూర్తి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు.
తాజావార్తలు
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!