CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: లవరం ప్రాజెక్టులోని వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడతలో భాగంగా, నిర్వాసితులకు రూ.226 కోట్ల చెక్కును అందించారు. ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిగా మారాలని, నదులు అనుసంధానం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. గత పాలకులు నిర్వాసితులను పట్టించుకోలేకపోయారు. వారు వరద నీటిలో మునిగిపోతున్నా నిర్లక్ష్యంగా వదిలేశారని తెలిపారు. రంపచోడవరం నియోజకవర్గం కేంద్రంగా పోలవరం జిల్లాని ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రాజెక్టు నిర్వాసితులు సంపూర్ణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఇళ్లను, భూములను త్యాగం చేశారని చెప్పారు సీఎం చంద్రబాబు.. ఈ ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వాసితుల ఖాతాల్లో రూ.226 కోట్లు జమ చేస్తున్నామని, వచ్చే ఉగాది తర్వాత రెండు నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తై మన అందరి కల సాకారం అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల డయాఫ్రాం వాల్ దెబ్బతిన్నది, దీనిపై నిపుణులతో అధ్యయనం చేసి ఇప్పుడు కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. వారంలో డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ప్రాజెక్టు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయన్నారు. 21 నెలల్లో ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామని, 2025 జనవరిలో సంక్రాంతి పండుగలో మొదటి విడతగా నిర్వాసితులకు రూ.800 కోట్లు ఇచ్చామని తెలిపారు.
Also Read
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
దీపావళి సందర్భంగా రెండో విడతగా రూ.916 కోట్లను నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశారు. మూడో విడతగా ఉగాది పండుగ సందర్భంగా రూ.226.6 కోట్లను చెల్లిస్తున్నారు. ఈ 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు మొత్తం రూ.1943.53 కోట్లను చెల్లించామని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు రెండు దశలుగా నిర్మితమవుతుంది. 38,068 మంది నిర్వాసితులు మొదటి దశలో ఉన్నారు. 75 నిర్వాసిత కాలనీల్లో 26 పూర్తయ్యాయి, ఇంకా 49 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. 2026 డిసెంబరులో వీటి నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు. ఇంకా రూ.3,500 కోట్ల ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ప్రతీ నిర్వాసితుడికి రూ.3.5 లక్షల ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని, ఇంటి జాగా కోసం రూ.2 లక్షలకు పెంచారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తోందని చెప్పారు. గత పాలనలో తప్పులు జరిగాయనీ వాటిని క్షమించమని తెలిపారు.
మా ప్రభుత్వానికి కమిట్మెంట్:
పారదర్శకంగా నిర్వాసితులకు చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాఉ.. నిర్వాసితులు దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు. గోదావరి పుష్కరాలు మూడోసారి నిర్వహించడానికి గౌరవం దక్కిందని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ప్రారంభానికంటే ముందే నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తికి మరో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ఒక వంతెన కూడా నిర్మించబడుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులంతా ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని అన్నారు. నిర్వాసితుల త్యాగం ప్రతిఫలంగా పోలవరం ప్రాజెక్టు దేశానికి అత్యంత గొప్పదిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయడంలో కూటమి ప్రభుత్వం సౌకర్యాలను అందిస్తున్నది, వారి సంక్షేమం కోసం మేం కృషి చేస్తున్నామన్నారు. ఇంకా, గౌరవం కోసం లభ్యమైన నిధులను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్లో ఉండగానే ఇంత సడెన్గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!