Venugopala Krishna: బీసీల శక్తిని గుర్తించింది వైఎస్సార్, జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయంగా బహుజనులు చైతన్యవంతులైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజమండ్రి లోక్సభ వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర బీసీ సామాజిక ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాజమండ్రి వీఎల్ పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో ‘శెట్టిబలిజ, గౌడ ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. ఈ సభకు ఎంపీ భరత్ అధ్యక్షత వహించారు. రాజమండ్రి అర్బన్, రూరల్, రాజమండ్రి లోక్సభ స్థానాలను బీసీలకే సీఎం జగన్ కేటాయించడం శుభపరిణామమని మంత్రి చెల్లుబోయిన అన్నారు. ఈ ముగ్గుర్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత బహుజనులు అందరిపైనా ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. ఏ ఒక్క పార్టీ బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించలేదన్నారు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీసీలను తన సొంత తోబుట్టువులు మాదిరిగా బీసీల సంక్షేమాన్ని, రాజకీయంగా అగ్రస్థానంలో ఉంచారన్నారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వివిధ సంక్షేమ పథకాల పేరుతో లబ్ధిదారుల ఖాతాలో రూ.2.55 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తే, ఒక్క బీసీలకే ఒక లక్షా, 80 వేల కోట్లు అందజేశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. గత టీడీపీ పాలనలో ఏనాడూ బీసీలను గుర్తించలేదు దుయ్యబట్టారు. మొన్న టీడీపీ 95 స్థానాలు ప్రకటిస్తే సామాజిక న్యాయం ఎక్కడ పాటించిందని వారు ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాలో 3 శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 21 సీట్లు, 50-60 శాతం ఉన్న బీసీలకు 18 స్థానాలు కేటాయించిందని.. ఇదేనా సామాజిక న్యాయమని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్మోహన్ ల మధ్య నక్కకూ నాగలోకానికీ ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి బీసీలంటే ఎక్కువ అభిమానం చూపిస్తారని.. అందుకే నిధుల కేటాయింపులో చూసినా, రాజకీయంగా ప్రోత్సహించడంలో కానీ, పదవులు ఇవ్వడంలో కానీ.. దేనిలో చూసినా జగన్మోహన్ రెడ్డిదే పై చేయి అన్నారు. అటువంటి మనసున్న మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కలకాలం గెలిపించుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైనా ఉందని బీసీ నాయకులు పిలుపునిచ్చారు.
Also Read
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
బీసీలకు సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గొప్ప సాహసం చేస్తున్నారని.. అది మన ఐక్యతపై జగనన్నకు ఉన్న నమ్మకమని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టాల్సిన బాధ్యత బీసీలు అందరిపైనా ఉందన్నారు. అవకాశాలిచ్చే నాయకులను గుర్తించి గౌరవించాలని, జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని శెట్టిబలిజ, గౌడ సామాజిక వర్గీయులకు సభలో వక్తలు పిలుపునిచ్చారు. తెలుగుజాతి ఆత్మ గౌరవం కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి దివంగత ఎన్టీఆర్ ఢిల్లీ పెద్దలకు వ్యతిరేకంగా పోరాడితే.. ఈనాడు తమ రాజకీయ స్వలాభం కోసం అదే టీడీపీ ఢిల్లీ పెద్దలకు తమ ఆత్మాభిమాన్ని తాకట్టుపెడుతున్నారని విమర్శించారు. రేపు జరగబోయే ఎన్నికలలో టీడీపీ, జనసేన పార్టీలను చిత్తుగా ఓడించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి అర్బన్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మార్గాని భరత్ రామ్, రూరల్ నుండి పోటీచేస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ లను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత శెట్టిబలిజ, గౌడ తదితర బహుజనులు అందరిపైనా ఉందని ఈ ఆత్మీయ సమ్మేళనం తీర్మానించింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!