Harsha Kumar: ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం దోచుకునే ప్రయత్నం చేస్తోంది
- ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం దోచుకునే ప్రయత్నం చేస్తోంది
- పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేరన్న హర్షకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోచుకుంటోందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ముఖ్యమంత్రులకు నచ్చిన కాంట్రాక్టర్లకే పనులు కట్టబెడుతున్నారు. చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాను. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేరు. చంద్రబాబు అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్. డయాఫ్రం వాల్ కడుతున్న ప్రాంతం సరైంది కాదు. రానున్నది వర్షాకాలం.. వరదల సమయం… అంచనాలు మించి వరద ప్రవాహం ఉంటుంది. డయాఫ్రం వాల్, కాపర్ డామ్ల నిర్మాణం గురించి నేను ఎప్పుడో చెప్పాను. వాటి నిర్మాణం అంత సులువు కాదు.’’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Infosys: నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలన్నారు.. కానీ, ఇన్ఫోసిస్ మాత్రం..
Also Read
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
‘‘పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం ఆదమరుపుగా ఉన్న గోదావరి జిల్లాలకు పెను ప్రమాదం పొంచి ఉంటుంది. వరదల కారణంగా మరో 15 రోజుల్లో ప్రాజెక్టు పనులు నిలిచిపోతాయి. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఉండదు. దానిలో సంవత్సరం అంతా నీరు అందుబాటులో ఉండదు. దానికోసం రూ.82 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామంటున్నారు. అక్కడ మంచి మంచి భూములు తీసుకుని రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారు. ప్రాజెక్టు పేరుతో డబ్బు దోచుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బనకచర్లను కేంద్రం ఆపివేయడం పట్ల పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నాను.’’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Rekha Gupta: 5 టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం బంగ్లాకు ఎంత ఖర్చు చేస్తున్నారంటే..!
‘‘చంద్రబాబు చెప్పినట్లుగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం దేశంలో నడుస్తున్నది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు డబ్బులు ఇంజన్ సర్కార్. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళితే ఛీదరింపులు ఎదుర్కొంటారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు తదితర పథకాలపై ప్రజలు నిలదీస్తారు. గడిచిన ఏడాది కాలంలో చంద్రబాబు ఓటమిని ఎమ్మెల్యేలపై పెట్టాలని చూస్తున్నారు. గడచిన ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే అక్రమాలకు పాల్పడుతున్నారు. పర్యావరణ సమతుల్యత పాటించాలనే కనీస పరిజ్ఞానం చంద్రబాబుకు లేదు.’’ అని హర్హకుమార్ ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!