Deputy CM Peedika Rajanna Dora: నేను పవన్ అభిమానిని.. ఈ ఘటనతో అది పోగొట్టుకున్నాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ఎయిర్పోర్ట్ ఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రచ్చగా మారుతోంది.. ఈ ఘటనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను టార్గెట్ చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విశాఖపట్నం విమానాశ్రయంలో మంత్రులపై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం రాజన్నదొర… పవన్పై విరుచుకుపడడ్డారు.. నేను వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ అభిమానిని.. కానీ, విశాఖ ఘటనతో అయన మీద ఉన్న అభిమానాన్ని పోగొట్టుకున్నాడని వ్యాఖ్యానించారు. పవన్ తన కార్యకర్తలని క్రమశిక్షణలో పెట్టుకోలేపోతున్నారన్న ఆయన.. జన సైనికులలో క్రమశిక్షణ లేక పోవడం వల్లే అధికారంలోకి రాలేకపోయామని గతంలో పవన్ కల్యాణ్ చెప్పారని గుర్తుచేశారు.. పవన్ కల్యాణ్ తన కోసం రాజకీయాలు చెయ్యడం లేదు చంద్రబాబు కోసమే చేస్తున్నాడని ఆరోపించారు.
Read Also: Threat Call to SBI: లోన్ ఇవ్వకుంటే బ్యాంక్ను పేల్చేస్తా.. చైర్మన్ను లేపేస్తా..!
Also Read
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR : జనసేన ఎమ్మెల్యే మరింత చిక్కుల్లో పడబోతున్నాడా?
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
ఇక, ఉత్తరాంధ్రలో రాజధానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన మంత్రుల మీద రాళ్ల దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు డిప్యూటీ సీఎం రాజన్న దొర.. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తన కార్యకర్తలని అదుపులో పెట్టుకోవాలని సూచించిన ఆయన… ఇది ఇంతటితో ముగిసిపోయేది కాదు.. దాడి చేసిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.. శాంతిభద్రతలను భంగం కలిగించినవారు ఎంతవారైన వదిలేదే లేదని స్పష్టం చేసిన ఆయన.. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరిస్తాం మిగతా విషయాలు ఆయనే చూసుకుంటారు.. ఆయనే తగు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు డిప్యూటీ సీఎం రాజన్నదొర. కాగా, మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జనకు జేఏసీ ఇచ్చిన పిలుపునకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు తెలిపింది.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పాల్గొని.. సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని.. విపక్షాలు కలసి రావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!