Cyclone sitrang: సిత్రాంగ్.. 12 గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు దీపావళి.. మరోవైపు సముద్రంలో అలజడి.. కోస్తా ప్రాంతంలో తుఫాన్ టెన్షన్ పెడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సిత్రాంగ్ తుఫాన్ స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఐఎండీ వెల్లడించింది. ఏపీలోని తీరప్రాంతాల్లోని 105 మండలాల్లో అప్రమత్తత ప్రకటించారు. ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Also:Governor Tamilisai Soundararajan: పెండింగ్ బిల్లులపై త్వరలో నిర్ణయం
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
తుఫాన్ ను ఎదుర్కోనేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ గురించి ఆందోళన చెందవద్దని వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 1070, 1800 4250101, 0863 2377118 నెంబర్లకు ఫోన్ చేస్తే తుఫాన్ గురించిన సమాచారం అందుబాటులో ఉంచారు. ఇదిలా వుంటే.. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తుఫాన్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. బక్కాలి బీచ్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా వున్నారు. ఎన్డీఆర్ ఎఫ్ టీంలు ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఈ ప్రాంతంలో టూరిస్టులు జాగ్రత్తగా వుండాలని అధికారులు హెచ్చరించారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో షాపులు మూసివేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీగా వున్నామని.. డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీం అధికారి అన్మోల్ సస్మోర్ తెలిపారు.
రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది. ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ బంగాల్ తీరప్రాంతాల మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగ్లాదేశ్ దగ్గర తుఫాన్ తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం సాగర్ దీవికి 380 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం వల్ల చలి తీవ్రత పెరుగుతోంది.
Read Also: Ebola Outbreak: ఉగాండాలో ఎబోలా కల్లోలం.. ఇప్పటి వరకు 40 మరణాలు.
తాజావార్తలు
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
-
Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.