AP DGP: మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు..
- రాష్ట్రంలో సైబర్ నేరాలు 34%, గంజా కేసు 3% పెరిగాయి..
- ఏపీలో ఓవరాల్ క్రైమ్ రేటు 5. 2 శాతం మేర తగ్గింది..
- మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు: డీజీపీ ద్వారక తిరుమలరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP DGP: రాష్ట్రంలో సైబర్ క్రైమ్ 34 శాతం పెరిగింది.. గంజా కేసులు 3 శాతం పెరిగాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. 97,760 గత సంవత్సరం రిపోర్ట్ అయిన క్రైమ్స్.. ఈ సంవత్సరం 92,094 క్రైం రిపోర్ట్ అయ్యాయి.. ఓవరాల్ క్రైం రేటు 5.2 శాతం తగ్గిందన్నారు. ఇక, దొంగతనం, దోపిడీ కేసులు 0.2 శాతం పెరిగాయి.. మహిళల పట్ల జరిగిన క్రైంలు 10 శాతం తగ్గాయని ఆయన సూచించారు. మహిళల హత్యలు మాత్రమే 20 శతాం పెరిగాయన్నారు. ఎస్సీ, ఎస్టీల పట్ల నేరాలు కూడా 4.9 శాతం తగ్గాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
Read Also: UP : చపాతీలు లేటుగా పెట్టారని పెళ్లి నుంచి వెళ్లిపోయి వేరే అమ్మాయిని చేసుకున్న వరుడు
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
అలాగే, మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు అని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పుకొచ్చారు. ప్రతీ జిల్లాకి ఒక సైబర్ క్రైం పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయడానికి సీఎం నిర్ణయించారు.. బ్యాంకర్లు కూడా అధిక మొత్తంలోని లావాదేవీల విషయంలో కస్టమర్లతో మాట్లాడితే పెద్ద నేరాలు జరగకుండా ఆపొచ్చని సూచించారు. ఇక, 10, 837 ఎకరాల్లో గంజాయికి మారు పంటలు కూడా వేయించాం.. అలాగే, డ్రోన్లు వినియోగంలో ఆధునికతను పెంచుతున్నాం.. 173 డ్రోన్లను వినియోగిస్తున్నాం.. మనిషి వెళ్ళలేని చోట డ్రోన్లు వాడుతున్నామని వెల్లడించారు. కార్తీక మాసంలో డ్రోన్ల వల్లే బాపట్లలో ముగ్గురిని కాపాడాం.. విజయవాడ ట్రాఫిక్ కంట్రోల్ కి డ్రోన్ వినియోగిస్తున్నామని డీజీపీ తిరుమలరావు పేర్కొన్నారు.
Read Also: Deputy CM Pawan Kalyan: అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదు..
అయితే, ఏపీ, తెలంగాణాల్లోనే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం అమలులో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు చెప్పారు. AIను విదేశీ వ్యక్తులు, వేరే భాష వాళ్ళు ఉన్న కేసుల్లో వినియోగిస్తాం.. AI VijayASTram అనేది ప్రస్తుతం ట్రాఫిక్ మేనేజ్మెంట్ కు విజయవాడలో వినియోగిస్తున్నారు.. సీసీ టీవీలు ప్రతీ చోటా ఉండాలి… నేరం జరిగిన విజువల్స్ కచ్చితంగా రికార్డు కావాలి.. సీసీ టీవీ కెమెరాలు విస్తృతంగా పెంచుతున్నామన్నారు. త్వరలోనే లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు, AI ద్వారా స్మార్ట్ పోలీసింగ్ చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే, పోలీసు వెల్ఫేర్ కి రూ. 20 కోట్లు సీఎం ఇటీవల ఇచ్చారు.. 189 సీనియర్ లెవెల్ ప్రొమోషన్లు ఇచ్చాం.. AFORCE ప్రస్తుతం ఆపరేషన్ లో ఉంది.. జత్వానీ కేసులో కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి చర్యలు తీసుకుంటారు.. మాజీ ఆర్మీ ఉద్యోగి ASP గా పవన్ కళ్యాణ్ పర్యటనలో తిరగలేదు.. ఆ వ్యక్తి శిలాఫలకం దగ్గర ఫోటోలు దిగాడని డీజీపీ ద్వారక తిరుమలరావు తెలిపారు.
తాజావార్తలు
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్కు బెయిల్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!