CPI Ramakrishna: రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం..
కర్నూలు జిల్లా ఆలూరు మండలం వుళేబీడు గ్రామ సమీపంలో వేరు శనగ పంట పొలాలలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. ఆలూరులో మంత్రి జయరాం ఉండి కూడా పంట పొలాలను పరిశీలించకపోవడం చాలా బాధాకరం అని ఆయన వ్యాఖ్యనించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాకు వచ్చి బటన్ నొక్కి వెళ్ళాడు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాల మంత్రులు కరువుపై ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.
Read Also: Team India: హార్ధిక్ లేని లోటును ఏ ప్లేయర్ తీర్చనున్నాడు.. ఫ్యాన్స్లో ఆందోళన
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
రైతుల సమస్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి, మంత్రులకు పట్టలేదు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గత రెండు రోజులుగా నేను పంట పొలాలను పరిశీలించినప్పుడు పూర్తిగా అన్ని పంటలు దెబ్బతిన్నాయి.. రైతులు పూర్తిగా నష్టపోయారు వెంటనే కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సీపీఐ పార్టీ శ్రీకారం చుడుతుంది అని రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులను పట్టించుకునే ప్రభుత్వం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వేరు శనగ పంటను చూస్తుంటే గుండెలో బాధ కలిగిందని ఆయన అన్నారు. వెంటనే జగన్ సర్కార్ రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని సీపీఐ రామకృష్ణ డిామాండ్ చేశారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో