ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రుడి బడ్జెట్ పిట్టల రాయుడి బడ్జెట్.. ఇది కూతల బడ్జెట్, కోతల బడ్జెట్ అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. మొదటి , రెండవ బడ్జెట్ లో కూతలు పెట్టిన ఈ ప్రభుత్వం.. మూడవ బడ్జెట్ లో ఎంతో కోత పెడుతోందన్నారు.. వ్యవసాయం , సాగునీటి రంగం, వైద్య , హౌసింగ్ రంగాలకు కేటాయించిన దానికంటే ఖర్చు పెట్టినది చాలా చాలా తక్కువని ఆరోపించిన తులసిరెడ్డి.. ఆ రంగాల పట్ల వైఎస్ జగన్ సర్కార్ ది చారిత్రాత్మక నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించారు.. ఇక, అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింద్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.. ఇది వినాశక , తిరోగమన బడ్జెట్గా కామెంట్ చేశారు తులసిరెడ్డి.