CM YS Jagan: నేడు తిరుపతి, నంద్యాల జిల్లాలో సీఎం పర్యటన.. ఆ రెండు కుటుంబాలకు పరామర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు.. మరోవైపు శుభకార్యాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఇంకోవైపు, కుటుంబ పెద్దలను, కుమారులను కోల్పోయినవారిని కూడా పరామర్శిస్తూ.. వారికి ధైర్యాన్ని చెబుతూ వస్తున్నారు.. ఇక, ఇవాళ తిరుపతి, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్.. సాయంత్రం తిరుపతికి వెళ్లనున్నారు వైఎస్ జగన్.. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. సాయంత్రం 5 .15కు తుమ్మలగుంట చేరుకోనున్నారు.. అక్కడి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో అరగంటపాటు గడపనున్నారు.. తిరిగి సాయంత్రం 6 గంటలకు తుమ్మలగుంట నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఆయన.. 6.15కి రేణిగుంట నుంచి గన్నవరం బయల్దేరనున్నారు..
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Heatwave Alert: భగభగమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. మరో మూడు రోజుల పాటు ఇదే తప్పదు సుమీ..!
- Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
- Satya Kumar Yadav: 'ఎబోలా'పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
ఇక, ఇవాళ ఉదయం నంద్యాల జిల్లాకు వెళ్లనున్నారు సీఎం వైఎస్ జగన్.. జూపాడుబంగ్లా మండలం పారుమంచాలలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.. ధర్మారెడ్డి కుమారుడి మృతితో దుఖఃసాగరంలో పారుమంచాల మునిగిపోయింది.. గుండెపోటుతో చెన్నైలో చికిత్స పొందుతూ మృతిచెందిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి భౌతికకాయానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. ఇప్పటికే పారుమంచాలకు చంద్రమౌళి మృతదేహాన్ని తరలించారు.. చంద్రమౌళి భౌతికకాయాన్ని సందర్శించి సీఎం జగన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు.. మరోవైపు.. చంద్రమౌళి రెడ్డి మృతికి సంతాపంగా ఇవాళ మధ్యహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తిరుమలలో దుకాణాలు మూసివేయాలని స్థానికులు నిర్ణయించారు.. ఇక, ఏపీ ప్రభుత్వ విప్, చంద్రగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఈ మధ్య కన్నుమూశారు. కొంత కాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడిన ఆయన.. సోమవారం రాత్రి హఠాత్తుగా ఊపిరి పీల్చడంలో ఇబ్బంది కలగడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్విమ్స్ కు తరలించారు. వైద్య బృందం తమ వంతు ప్రయత్నం చేశారు.. అయినా అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న మణి రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలోనే.. చెత్త రికార్డు మూట గట్టుకున్న రోహిత్ శర్మ..
-
Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
-
Ravindra Jadeja: నో బాల్తో తప్పించుకున్న జడేజా.. శార్దూల్కు బౌండరీలతో స్ట్రాంగ్ రివెంజ్.!
-
Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య బలహీనత తెలిసిపోయింది.. వరుస డకౌట్స్..
-
Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!