CM Jagan: ఆనాడు నన్ను టార్గెట్ చేసిన పార్టీ ఈరోజు నామరూపాల్లేకుండా పోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఓదార్పు యాత్ర చేయవద్దన్న పార్టీని తాను వ్యతిరేకించినందుకు తనపై అక్రమ కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దేశంలోని శక్తివంతమైన వ్యవస్థలను తనపై ఉసిగొల్పాయని.. అన్యాయమైన ఆరోపణలు చేయించి కేసులు పెట్టించి అరెస్ట్ చేయించారన్నారు. ఆనాడు వాళ్లకు లొంగిపోయి ఉంటే ఈనాడు జగన్ మీ ముందు ఇలా ఉండేవాడు కాదని వ్యాఖ్యానించారు. తనను టార్గెట్ చేసిన పార్టీ ఈరోజు నామరూపాల్లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి జగన్ మండిపడ్డారు. గతంలో ఎన్నికల తర్వాత టీడీపీ మేనిఫెస్టో కనిపించకుండా చేశారని.. కానీ తాము పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నామని.. జగన్ చెప్పింది నిజమని నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఓటేయాలని ప్లీనరీ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో సెల్ఫోన్ లైట్లతో ఆపరేషన్లు చేసిన ఘటనలు చూశామని.. ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు కొరికిన ఘటనలు చూశామని.. తాము నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చామని జగన్ తెలిపారు.
Read Also: Y. S. Sharmila : కాంగ్రెస్, షర్మిల పార్టీ పొత్తు? సమీకరణాలు మారుతున్నాయా..? |
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ఆనాడు ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు 151కి, ఒక్క ఎంపీతో ప్రారంభమైన ప్రయాణం 22కి చేరిందని సీఎం జగన్ అన్నారు. 2014 ఎన్నికల్లో 1 శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయామని చెప్పారు. అప్పుడు తమ 23 మంది ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా టీడీపీ కొనుగోలు చేసిందని, 2019లో ఆ పార్టీకి అవే సంఖ్యలో సీట్లు వచ్చాయని తెలిపారు. టీడీపీ లాగా తాను ఎమ్మెల్యేలను కొనడంపై దృష్టి పెట్టలేదని, తన ఫోకస్ అంతా ప్రజల మంచి కోసమేనని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారని.. పేదలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలనడం విడ్డూరమని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ఎదగకూడదన్నదే చంద్రబాబు విధానమని ఆరోపించారు. నారాయణ, చైతన్య స్కూళ్ల కోసం చంద్రబాబు శ్రమిస్తారని.. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడం కోసం తాము శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. ఒక్క విద్యా రంగంలో 9 పథకాలను అమలు చేశామని.. అమ్మఒడి ద్వారా ఇప్పటివరకు రూ.19,617 కోట్లు ఇచ్చామని జగన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!