CM Jagan : లబ్దిదారుల ఖాతాల్లో 534 కోట్లు జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2021 నవంబర్లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వరదలతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని నేడు సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. జగన్ బటన్నొక్కి నేరుగా 5.17 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.534.77 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 1,220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లు అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
రెండేళ్ల నుంచి వర్షాలు బాగా కురుస్తున్నాయని, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయని ఆయన అన్నారు. వరదలతో కొన్ని ప్రాంతాల్లోని పంటలు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో రైతన్నలకు నష్టపరిహారం అందించిన తొలి రాష్ట్రామనదేనని ఆయన అన్నారు. 2014 ఖరీఫ్ సీజన్లో చోటుచేసుకున్న కరువుకు 2015 నవంబర్లో వరకు కూడా ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. అలాగే 2015 లో చోటు చేసుకున్న కరువుకు కూడా 2016 నవంబర్ వరకు ఇచ్చిన పరిస్థితి లేదని ఆయన అన్నారు.
Also Read
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.