Chandrababu: వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
- వరద సహాయక చర్యలపై మంత్రులు.. అధికారులతో ఏపీ సీఎం టెలి కాన్ఫరెన్స్..
- ఫైరింజన్లతో రోడ్లు.. కాలనీలు.. ఇళ్లు క్లీనింగ్ వేగవంతం చేయాలని ఆదేశం..
- నిత్యావసరాతో కూడిన ఆరు వస్తువుల పంపిణీ తొందరగా చేయాలి: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: విజయవాడలో ఆరవ రోజు వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను సీఎంకు అధికారులు వివరించారు. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు క్లీనింగ్ ను మరింత వేగవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనుల ప్రోగ్రెస్ ను అడిగి తెలుసుకున్నారు. అలాగే, బుడమేరు వాగుకు గండ్లుపూడ్చి వేత కార్యక్రమంలో రంగంలోకి దిగిన భారత ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం.. యద్ద ప్రాతిపదికన పనులు చేపట్టి.. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు.
Read Also: Student Suspend: టిఫిన్లో నాన్వెజ్ను పాఠశాలకు తెచ్చిన విద్యార్థి.. సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
ఇక, అత్యంత క్లిష్టంగా ఉన్న మూడో గండి పూడ్చివేత పనులను ఆర్మీ అధికారుల సహకారంతో వేగంగా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో మూడో గండి పూడ్చివేత పనులు త్వరగా పూర్తి చేయలన్నారు. కరెంట్ సరఫరా, టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్దరణ, ట్యాంకర్లతో తాగునీటి సరఫరా వివరాలు తెలుసుకున్నారు. నిత్యావసరాతో కూడిన ఆరు వస్తువుల పంపిణీపైనా కూడా ఆయన సమీక్ష చేశారు. ఇప్పటికే ప్యాకింగ్ పూర్తి చేసి బాధితులకు అందిస్తున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. వాహనాలు, ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్ల ను పిలిపించాలని సీఎం సూచించారు. అవసరం అయితే కొంత పారితోషికం ఇచ్చి అయినా మెకానిక్లను, టెక్నీషియన్లను ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!