Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ex Minister Rk Roja Fires On Cm Chandrababu Pawan Kalyan And Ttd

RK Roja: తప్పించుకునే ప్రయత్నం.. చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిపై కేసు పెట్టాలి..

Published Date :January 11, 2025 , 1:27 pm
By Sudhakar Ravula
  • తిరుపతిలో తొక్కిసలాట ఘటన రోజా ఫైర్..
  • సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం..
  • చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిలోని కేసు పెట్టాలి..
  • కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలి..
RK Roja: తప్పించుకునే ప్రయత్నం.. చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిపై కేసు పెట్టాలి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

RK Roja: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక్కడ చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిలోని అందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. అంతేకాదు.. దేశంలో ఉన్న కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఆరు మంది భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. అసలైన నిందితులపై కేసులు ఎందుకు పెట్టలేదు? అని నిలదీశారు.. మూడు రోజులు అయ్యింది, ఎందుకు పట్టించు కోవడం లేదు? సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, ఎస్పీతో సహా అందరిపై కేసు నమోదు చేయాలన్నారు.. ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకి ఇంకా బుద్ధిరాలేదన్న ఆమె.. దీనికి కారణమైన వారిని ఇంకా కాపాడాలి అని చూస్తున్నారు.. హిందువులు అనే గౌరవం లేదా? భక్తులు ప్రాణాలకు విలువ లేదా? అని నిలదీశారు.

Read Also: Kerala: కేరళలో దారుణం.. టీనేజర్‌పై 64 మంది లైంగిక వేధింపులు..

6 మంది చనిపోయారు, 60 మంది గాయపడ్డారు.. ఈ ఘటనలో మొదటి ముద్దాయిగా సీఎం చంద్రబాబు నాయుడును చేర్చాలని డిమాండ్‌ చేశారు రోజా.. 6, 7, 8 తేదీల్లో కుప్పంలో సీఎం పర్యటన చేశారు.. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన హత్యగా భావించాలని పేర్కొన్నారు.. స్వర్ణకుప్పం, కుప్పం విజన్ 2029 అన్నారు.. 14 ఏళ్లు సీఎం అప్పుడు కుప్పం అభివృద్ధి ఏం అయ్యింది అని ప్రశ్నించారు.. నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి కుప్పం వచ్చారు.. అధికారులను నీ చుట్టూ తిప్పుకున్నారు.. వైకుంఠ ఏకాదశి లక్షలాది భక్తులు వస్తారని మీకు తెలియదా? మీ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయ్యింది.. మరి టోకెన్‌ సిస్టం ఎందుకు తీయలేదు అని ప్రశ్నించిన ఆమె.. డైవర్ట్ చేసి టోకెన్ సిస్టంపై పక్క దారి పట్టిస్తున్నారని విమర్శించారు.. మీ ప్రభుత్వంలో మీరు పెట్టుకున్న డిప్యూటీ సీఎం తిడుతున్నారు.. పవన్‌ కల్యాణ్‌ వాఖ్యలు ప్రజలను కన్ఫూజ్ చేస్తున్నాయన్నారు.

Read Also: VFX : ‘కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ’ సర్వీసెస్ ను ప్రారంభించిన దర్శకులు శ్రీను వైట్ల

తప్పు చేసిన వారికి శిక్షపడాలి.. తప్పు చేసిన వాళ్ళు ఎస్పీ, ఈవో, అడిషనల్ ఈవో అని మీరే చెప్తున్నారు.. వాళ్ళ తాట ఎందుకు తీయడం లేదు అని సీఎంని నిలదీశారు రోజా.. నీ పక్కన ఉన్న ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్ ను తిడితే మీరు ఏం చేశారు.. చేయని తప్పుకు లడ్డు విషయం లో కషాయం కప్పుకుని మాట్లాడారు.. ఇప్పుడు ఏమయ్యారు.. ఒక్కరూ చనిపోతే 14 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఫైర్‌ అయ్యారు.. మరోవైపు.. అల్లు అర్జున్ కు మానవత్వం లేదని పవన్ కల్యాణ్‌ అన్నారు.. గేమ్‌చేంజర్‌ ఆడియో ఫంక్షన్ కు వెళ్లి ఇద్దరు చనిపోతే కనీసం పరామర్శించలేదని విమర్శించారు. ఆరు మంది చనిపోతే, 60 మంది హిందువులు గాయపడితే చిన్నమ్మ పురంధేశ్వరి నోరు విప్పదు. నీతి మాలిన మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై మాట్లాడుతున్నారు.. దిగజారుడు గా మంత్రి ఆనం వాఖ్యలు ఉన్నాయి.. ప్రజలే మీకు బడిత పూజ చేస్తారు అని హెచ్చరించారు మాజీ మంత్రి ఆర్కే రోజా..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm chandrababu
  • Ex Minister RK Roja
  • pawan kalyan
  • Tirupati stampede

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions