RK Roja: తప్పించుకునే ప్రయత్నం.. చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిపై కేసు పెట్టాలి..
- తిరుపతిలో తొక్కిసలాట ఘటన రోజా ఫైర్..
- సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం..
- చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిలోని కేసు పెట్టాలి..
- కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక్కడ చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిలోని అందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. అంతేకాదు.. దేశంలో ఉన్న కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఆరు మంది భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. అసలైన నిందితులపై కేసులు ఎందుకు పెట్టలేదు? అని నిలదీశారు.. మూడు రోజులు అయ్యింది, ఎందుకు పట్టించు కోవడం లేదు? సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, ఎస్పీతో సహా అందరిపై కేసు నమోదు చేయాలన్నారు.. ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకి ఇంకా బుద్ధిరాలేదన్న ఆమె.. దీనికి కారణమైన వారిని ఇంకా కాపాడాలి అని చూస్తున్నారు.. హిందువులు అనే గౌరవం లేదా? భక్తులు ప్రాణాలకు విలువ లేదా? అని నిలదీశారు.
Read Also: Kerala: కేరళలో దారుణం.. టీనేజర్పై 64 మంది లైంగిక వేధింపులు..
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
6 మంది చనిపోయారు, 60 మంది గాయపడ్డారు.. ఈ ఘటనలో మొదటి ముద్దాయిగా సీఎం చంద్రబాబు నాయుడును చేర్చాలని డిమాండ్ చేశారు రోజా.. 6, 7, 8 తేదీల్లో కుప్పంలో సీఎం పర్యటన చేశారు.. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన హత్యగా భావించాలని పేర్కొన్నారు.. స్వర్ణకుప్పం, కుప్పం విజన్ 2029 అన్నారు.. 14 ఏళ్లు సీఎం అప్పుడు కుప్పం అభివృద్ధి ఏం అయ్యింది అని ప్రశ్నించారు.. నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి కుప్పం వచ్చారు.. అధికారులను నీ చుట్టూ తిప్పుకున్నారు.. వైకుంఠ ఏకాదశి లక్షలాది భక్తులు వస్తారని మీకు తెలియదా? మీ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయ్యింది.. మరి టోకెన్ సిస్టం ఎందుకు తీయలేదు అని ప్రశ్నించిన ఆమె.. డైవర్ట్ చేసి టోకెన్ సిస్టంపై పక్క దారి పట్టిస్తున్నారని విమర్శించారు.. మీ ప్రభుత్వంలో మీరు పెట్టుకున్న డిప్యూటీ సీఎం తిడుతున్నారు.. పవన్ కల్యాణ్ వాఖ్యలు ప్రజలను కన్ఫూజ్ చేస్తున్నాయన్నారు.
Read Also: VFX : ‘కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ’ సర్వీసెస్ ను ప్రారంభించిన దర్శకులు శ్రీను వైట్ల
తప్పు చేసిన వారికి శిక్షపడాలి.. తప్పు చేసిన వాళ్ళు ఎస్పీ, ఈవో, అడిషనల్ ఈవో అని మీరే చెప్తున్నారు.. వాళ్ళ తాట ఎందుకు తీయడం లేదు అని సీఎంని నిలదీశారు రోజా.. నీ పక్కన ఉన్న ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్ ను తిడితే మీరు ఏం చేశారు.. చేయని తప్పుకు లడ్డు విషయం లో కషాయం కప్పుకుని మాట్లాడారు.. ఇప్పుడు ఏమయ్యారు.. ఒక్కరూ చనిపోతే 14 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఫైర్ అయ్యారు.. మరోవైపు.. అల్లు అర్జున్ కు మానవత్వం లేదని పవన్ కల్యాణ్ అన్నారు.. గేమ్చేంజర్ ఆడియో ఫంక్షన్ కు వెళ్లి ఇద్దరు చనిపోతే కనీసం పరామర్శించలేదని విమర్శించారు. ఆరు మంది చనిపోతే, 60 మంది హిందువులు గాయపడితే చిన్నమ్మ పురంధేశ్వరి నోరు విప్పదు. నీతి మాలిన మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై మాట్లాడుతున్నారు.. దిగజారుడు గా మంత్రి ఆనం వాఖ్యలు ఉన్నాయి.. ప్రజలే మీకు బడిత పూజ చేస్తారు అని హెచ్చరించారు మాజీ మంత్రి ఆర్కే రోజా..
తాజావార్తలు
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!