Kerala: కేరళలో దారుణం.. టీనేజర్పై 64 మంది లైంగిక వేధింపులు..
- కేరళలో దారుణం..
- 5 ఏళ్లుగా బాలికపై 64 మంది లైంగిక వేధింపులు..
- ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..
Kerala: కేరళలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత 5 ఏళ్లుగా 64 మంది తనని లైంగికంగా వేధించారని ఓ దళిత బాలిక ఆరోపించింది. దీంతో ఇప్పుడు వారందరిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి పోలీసులు. కౌన్సిలింగ్ సెషన్లో తాను ఎదుర్కొంటున్న బాధను బాలిక వెళ్లకక్కింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఫిర్యాదు మేరకు పతనంతిట్ట పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.
మహిళా సమాఖ్య అనే ఎన్జీఓ సభ్యులు తమ దినచర్యలో భాగంగా ఫీల్డ్ విజిట్కి భాగంగా బాలిక ఇంటికి వెళ్లిన సమయంలో, ఈ దారుణాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ బాలికకు కౌన్సిలింగ్ అందించింది. కౌన్సిలింగ్ సమయంలో సైకాలజిస్ట్ దగ్గర తాను 13 ఏళ్లుగా ఎదుర్కొంటున్న భయానక అనుభవాలను తెలిపింది. ప్రస్తుతం ఆమెకు 18 ఏళ్లు.
Also Read
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
Read Also: Virat Kohli: కుటుంబం మొత్తంతో సాధువును కలిసిన విరాట్.. వీడియో వైరల్
13 ఏళ్ల వయసులో తన పొరుగువాడి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. అతను అశ్లీల చిత్రాలను తనతో పంచుకున్నట్లు చెప్పింది. తన పాఠశాలలో క్రీడల్లో చురుకుగా పాల్గొంటున్న సదరు బాలికను, శిక్షణా సెషన్లలో లైంగికంగా వేధింపులకు గురిచేసిన సందర్భాలను వెల్లడించింది. తన వీడియోలు కొన్ని సర్క్యులేట్ అయ్యాయని, ఇది ఈ వేధింపులను మరింతగా పెంచినట్లు తెలిపింది.
ఇప్పటి వరకు ఈ కేసులో 10 మందికి పైగా వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక నుంచి వివరణాత్మక వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత సీడబ్ల్యుసీ పతనంతిట్ట జిల్లా చైర్పర్సన్ ఎన్ రాజీవ్ మాట్లాడుతూ.. బాధితురాలకి అవసరమైన సంరక్షణ, రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఈ కేసు చాలా తీవ్రమైనదని, ఆ బాలిక 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి దాదాపుగా 5 సంవత్సరాలుగా లైంగిక వేధింపులకు గురైందని చెప్పాడు. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఆమెపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని రాజీవ్ తెలిపారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!