CM Chandrababu: కుప్పంకు కృష్ణమ్మ.. సీఎం చంద్రబాబు జలహారతి
- కృష్ణమ్మ కుప్పం చేరుకుంది..
- కుప్పంలో చివరి భూముల వరకు చేరిన కృష్ణమ్మ..
- కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కృష్ణమ్మ కుప్పం చేరుకుంది.. కుప్పం నియోజకవర్గంలోని చివరి భూముల వరకు చేరింది.. దీంతో, కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. హంద్రీ – నీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పం చివరి భూములకు చేరాయి కృష్ణా జలాలు.. ఏకంగా శ్రీశైలం నుంచి 738 కిలో మీటర్లు ప్రయాణించి కుప్పంలో బీడు భూములను తడుపుతోంది కృష్ణా నది.. పంచెకట్టుకుని సంప్రదాయ పద్ధతిలో కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు.. వేద మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణమ్మకు పసుపు, కుంకమ సమర్పంచి జలహారతి ఇచ్చారు.. ఈ జలహారతి కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం స్థానిక టీడీపీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు.. తమ నియోజకవర్గానికి కృష్ణా జలాలు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. జై చంద్రబాబు… జైజై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కుప్పం ప్రజలు..
Also Read
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
ఇక, కుప్పంలో స్త్రీ శక్తి బస్సులో ప్రయాణించారు ముఖ్యమంత్రి చంద్రబాబు .. మహిళలు, రైతులతో కలిసి బస్సులో ప్రయాణించారు.. కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు మహిళలు, రైతులతో సంభాషిస్తూ బస్సులో ప్రయాణం చేశారు ఏపీ సీఎం.. స్త్రీ శక్తి పేరుతో అందిస్తున్న ఉచిత బస్సు సదుపాయం ఎలా ఉందని మహిళలను అడిగి తెలుసుకున్నారు.. తాము ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది లేకుండా… ఫ్రీ బస్సులో వెళ్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు మహిళలు.. చక్కటి సదుపాయాన్ని కల్పించారని.. తమకు డబ్బులు ఆదా అవుతున్నాయని సీఎంతో చెప్పారు.. హంద్రీ – నీవా ద్వారా కృష్ణా నీళ్లు తొలిసారి కుప్పానికి వచ్చాయి.. కాల్వల్లో నీళ్లు చూశారా..? చెరువులు నిండాయా అంటూ చంద్రబాబు ఆరా తీశారు.. తొలిసారి కుప్పానికి కృష్ణమ్మ వచ్చిందని… చాలా సంతోషంగా ఉందని రైతులు, మహిళలు సీఎం చంద్రబాబు తెలియజేశారు..
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!